సంక్రాంతి పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుళకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ వచ్చిందంటే చాలు.. ప్రయాణ ఛార్జీలతో జేబులు ఖాళీ అవుతాయనే బాధ ఉంటుంది. కానీ, టీఎస్ఆర్టీసీ ఆ బాధ లేకుండా చేస్తోంది. పైగా బంపర్ ఆఫర్ కూడా ఇస్తోంది. పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారు. రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే.. 10 శాతం రాయితీ కల్పి్స్తోంది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, ఈ 10 శాతం రాయితీ తిరుగు ప్రయాణంపై వర్తిస్తుంది.
డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ ప్లస్ బస్సుల్లో అడ్వాన్స్డ్ రిజర్వేషన్ బుకింగ్ కి ఈ రాయితీ వర్తిస్తుందని పేర్కొంది. వచ్చే ఏడాది జనవరి 31 వరకు ఈ రాయితీ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. సంక్రాంతి పర్వదినం సందర్బంగా ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు 10 శాతం రాయితీని ప్రకటించాలని సంస్థ నిర్ణయించినట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు. ఈ రాయితీ సదుపాయాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని వారు సూచించారు. ముందస్తు రిజర్వేషన్ కొరకు www.tsrtconline.in ని సంప్రదించాలన్నారు.
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణంపై 10% రాయితీని టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. జనవరి 31,2023 వరకు ఈ రాయితీ అమల్లో ఉంటుంది. ముందస్తు రిజర్వేషన్ కోసం https://t.co/F0naRXIa8A ని సంప్రదించండి.
— Managing Director – TSRTC (@tsrtcmdoffice) December 26, 2022
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..