
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. హర్షగూడ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. పల్సర్ బైక్పై వస్తున్న ఒక యువకుడు ఎదురుగా వస్తున్న మరో మైక్ను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో యూనికార్న్ బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పల్సర్ బైక్పై వెళుతున్న ఓ యువకుడు కూడా మరణించాడు. మృతి చెందిన యువకులను మోహన్, సిద్దు, అరుణ్గా పోలీసులు గుర్తించారు.
విషయం తెలుసుకున్న పహాడీ షరీఫ్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతివేగంమూ ఈ ఘోర ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. పండగపూట యువకులు మరణించండంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.