జాతీయగీతం కాపీ కొట్టిన సీనియర్‌ అధికారి.. సెల్‌ఫోన్‌లో చూస్తూ జనగణమన పాడిన తరిగొప్పుల యంపీడీవో

|

Jan 26, 2021 | 4:57 PM

చిన్నప్పుడు బడికి వెళ్లిన వారెవరైనా జాతీయగీతం జనగణమన పాడే ఉంటారు. చిన్నప్పుడు కంఠస్తం చేసిన ఆ గీతం ఎప్పటికీ మర్చిపోకుండా పాడుతూ ఉంటారు. కానీ జాతీయ గీతం రాని ఆధికారులు..

జాతీయగీతం కాపీ కొట్టిన సీనియర్‌ అధికారి.. సెల్‌ఫోన్‌లో చూస్తూ జనగణమన పాడిన తరిగొప్పుల యంపీడీవో
Follow us on

చిన్నప్పుడు బడికి వెళ్లిన వారెవరైనా జాతీయగీతం జనగణమన పాడే ఉంటారు. చిన్నప్పుడు కంఠస్తం చేసిన ఆ గీతం ఎప్పటికీ మర్చిపోకుండా పాడుతూ ఉంటారు. కానీ జాతీయ గీతం రాని ఆధికారులు ఉన్నారంటే నమ్మశక్యంగా లేదు కదూ.. కానీ ఈ అధికారులను చూస్తే మాత్రం మీరు నమ్మి తీరాల్సిందే.

జనగాం జిల్లా తరిగొప్పుల మండల పరిషత్ అభివృద్ది ఆధికారి(యంపిడిఓ) ఇంద్రసేనా రెడ్డికి మాత్రం జాతీయ గీతం వచ్చేట్టు లేదు. ప్యాంట్ జేబులో నుంచి సెల్ ఫొన్ తీసుకొని ఆ ఫోన్‌లో చూసుకుంటూ జాతీయ గీతం ఆలపించారు. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిదీ ఘటన. ఆ అధికారికి జాతీయ గీతం జనగణమన గుర్తుకు లేదో.. ఎమో పాపం సెల్‌ఫోన్‌లో చూస్తూ అందరితో పెదవులు కలిపారు.

తరిగొప్పుల యంపీడీవో కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి, అందరూ జనగణమన గీతం ఆలపిస్తుంటే.. మన యంపీడీవో ఇంద్రసేనా మాత్రం అప్పటికే ఫొన్ లో డెస్క్ టాప్ పై సిద్ధంగా ఉంచుకున్న జనగణమన గీతం చూసుకుంటూ అందరితో మమా అనిపించారు. ఈ విషయం స్థానికంగా సొషల్ మిడియాలో వైరల్‌గా మారింది. వివిద ప్రభుత్వ శాఖల్లో సీనియర్ ఆధికారిగా పని చేసిన వ్యక్తికి జాతీయ గీతం రాదా అని చర్చించుకుంటున్నారు.