Telangana: ఏప్రిల్ 27వ తేదీ నుంచి వేసవి సెలవులు… ఎప్పటి వరకో ప్రకటించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

| Edited By: Ram Naramaneni

Apr 25, 2021 | 2:27 PM

Telangana Schools: ప్రతి ఏడాది వేసవి కాలంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడం సాధారణమే. అయితే ఏడాది వేసవి సెలవులను ప్రకటించారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి

Telangana: ఏప్రిల్ 27వ తేదీ నుంచి వేసవి సెలవులు... ఎప్పటి వరకో ప్రకటించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
Telangana Summer Holidays
Follow us on

Telangana Schools: ప్రతి ఏడాది వేసవి కాలంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడం సాధారణమే. అయితే ఈ ఏడాది వేసవి సెలవులను ప్రకటించారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఏప్రిల్‌ 27వ తేదీ నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉండనున్నట్లు తెలిపారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సంబంధించి ఈ వేసవి సెలవులను నిర్ణయించారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యా శాఖ అధికారులతో ఆదివారం జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు రద్దు కాగా, 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేశామని ప్రకటించారు. అలాగే 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 53 లక్షల 79 వేల 388 మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలను తరువాత ఎప్పుడు తెరిచేది కోవిడ్ – 19 పరిస్థితిని అనుసరించి జూన్ 1న ప్రభుత్వం నిర్ణయిస్తుందని మంత్రి తెలిపారు. ఏప్రిల్‌ 26వ తేదీని ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి రోజుగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో 27 నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇవీ చదవండి: తెలంగాణలో కరోనాపై హైకోర్టులో విచారణ.. కేసులు తగ్గాయన్న ప్రభుత్వం.. ఎక్కడ తగ్గాయో చూపించాలని హైకోర్టు ప్రశ్న

RBI: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. మే 1 నుంచి కొత్త కార్డుల జారీపై నిషేధం.. నిబంధనలు పాటించడం లేదన్న ఆర్‌బీఐ