
తెలంగాణ పదవ తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ చరిత్రలో తొలిసారి నెల రోజుల వ్యవధితో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. వచ్చే మార్చి 14న మొదలై ఏప్రిల్ 13 వరకు అంటే సరిగ్గా నెల రోజులు సమయం తీసుకోనున్నారు. ఒక్కో పరీక్షకు కనీసం మూడు రోజులు గ్యాప్ రావడం మధ్యలో పండగ హాలిడేస్ ఉండటంతో పరీక్షలు ఎక్కువ రోజులు ఉన్నాయి. అయితే పరీక్షలు నెలరోజుల పాటు నిర్వహణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని విద్యార్థి సంఘాలు షెడ్యుల్ పూర్తిగా అశాస్త్రీయంగా ఉందని మండిపడుతున్నాయి.
AISF లాంటి వామపక్ష విద్యార్థి సంఘాలు షెడ్యుల్ సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏడు పరీక్షలను నెల రోజుల పాటు నిర్వహించడం సరికాదని.. ఆ షెడ్యూల్ వెంటనే మార్చాలని కోరుతున్నారు. ఒక్కో పరీక్షకు మధ్య రెండు రోజుల గడువు ఉంటే సరిపోతుందని కానీ ఏడు పరీక్షలకు నెల రోజుల పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడం వల్ల విద్యార్థులు ఒత్తిడికి గురవుతారని అంటున్నారు. అంతేకాకుండా నెల రోజులపాటు పరీక్షల నిర్వహణ అంటే ప్రశ్నాపత్రాల భద్రత, మూల్యాంకన ప్రక్రియపై కూడా ప్రభావం పడుతుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే పదవ తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ ని సవరించి మరొక షెడ్యూల్ విడుదల చేయాలని AISF విద్యార్థి సంఘాల నేతలు మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
మరోవైపు విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో సైతం పదో తరగతి పరీక్షల షెడ్యూల్ చర్చనీయాంశంగా మారింది. ఫెస్టివల్ హాలిడేస్లో విద్యార్థులు ఇబ్బంది పదొద్దని ఎక్కువ గ్యాప్ ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ ఎక్కువ గ్యాప్ వల్ల స్టూడెంట్స్పై నెగటివ్ ప్రభావం ఉంటుందని మరికొందరు విద్యావేత్తలు అంటున్నారు. టీచర్లు సైతం తొలిసారి ఇంత లాంగ్ గ్యాప్తో పరీక్షలు నిర్వహిస్తున్నారని చర్చించుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..