Telangana: కొత్త తెల్ల రేషన్ కార్డుల జారీ ఎప్పుడంటే..? కీలక అప్డేట్ ఇచ్చిన మంత్రి

కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులోని కొన్ని పథకాలకు కార్డు అనుసంధానం తప్పనసరి కావడంతో చాలామంది వినియోగదారులు కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజా పాలనతో దరఖాస్తులు చేసుకున్నారు. ఇతర పథకాల కంటే రేషన్ కార్డు జారీ కోసమే ఎక్కువ అప్లికేషన్స్ రావడం గమనార్హం. 

Telangana: కొత్త తెల్ల రేషన్ కార్డుల జారీ ఎప్పుడంటే..? కీలక అప్డేట్ ఇచ్చిన మంత్రి
Ration Cards

Updated on: Feb 28, 2024 | 6:52 PM

ఖమ్మంలోని పాలేరు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి/షాదీముబారక్ చెక్కులను తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పంపిణీ చేశారు. ఆ తర్వాత మహమ్మదాపురంలో రూ.5 కోట్లతో నిర్మించనున్న గిరిజన మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల, వెంకటగిరిలో రూ.2.65 కోట్లతో నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసిన ఆరు హామీల్లో ఆర్టీసీ ఉచిత ప్రయాణ పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచిందన్నారు. మరో రెండు హామీలు (ఉచిత విద్యుత్, రూ.500 సిలిండర్) కూడా అమల్లోకి తెచ్చారు.

ప్రభుత్వం ఎంత కష్టమైనా హామీని నెరవేరుస్తుంది. ప్రజా పాలన కార్యక్రమంలో ఇచ్చిన దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన వారందరికీ రూ.500కే ఎల్పీజీ సిలిండర్ ఇస్తామని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ధరణి పేరుతో గత ప్రభుత్వం వేలాది ఎకరాలను ఆక్రమించిందని ఆరోపించారు. అర్హులైన కుటుంబాలకు త్వరలోనే తెల్ల రేషన్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మహిళలకు త్వరలోనే రూ.2,500 సాయం అందిస్తామని ఆయన అన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలామంది పేదలకు రేషన్ కార్డులు అందక ఇబ్బందులు పడ్డారు. మునుగోడు, హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. కానీ ఎన్నికల కోడ్, ఇతరత్రా సమస్యల వల్ల సాధ్యపడలేదు. అయితే కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులోని కొన్ని పథకాలకు కార్డు అనుసంధానం తప్పనసరి కావడంతో చాలామంది వినియోగదారులు కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజా పాలనతో దరఖాస్తులు చేసుకున్నారు. ఇతర పథకాల కంటే రేషన్ కార్డు జారీ కోసమే ఎక్కువ అప్లికేషన్స్ రావడం గమనార్హం. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి కీలక అప్డేట్ ఇవ్వడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us