Telangana: ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి అందుబాటులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ హాల్ టికెట్స్..

Telangana: తెలంగాణలో ఈ నెల 25 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎగ్జామ్స్‌కు సంబంధించి హాల్ టికెట్స్ ఇవాళ సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు.

Telangana: ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి అందుబాటులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ హాల్ టికెట్స్..
Telangana Inter Board

Updated on: Oct 19, 2021 | 5:48 AM

Telangana: తెలంగాణలో ఈ నెల 25 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎగ్జామ్స్‌కు సంబంధించి హాల్ టికెట్స్ ఇవాళ సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డ్ అధికారులు వెల్లడించారు. ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ అయిన tsbie.cgg.gov.in నుండి విద్యార్థులు నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. ఫొటో, సబ్జెక్టు, సంతకం ,పేరు ఇతర వివరాలలో ఏమైనా తప్పులు ఉంటే వెంటనే ప్రిన్సిపాల్, జిల్లా ఇంటర్ విద్యాధికారి దృష్టికి తీసుకురావాలి అని విద్యార్థులకు సూచించారు అధికారులు. కాగా, పరీక్షల సూపరింటెండెంట్‌లు హాల్ టికెట్‌పై ప్రిన్సిపాల్ సంతకం లేకున్నా పరీక్షకు అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. కాగా, ఈ నెల 25 నుండి వచ్చే నెల 3 వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో 29, 30 తేదీల్లో పరీక్షలను నిర్వహించడం లేదు.

Also read:

Hyderabad: ‘అయ్యాయో వద్దమ్మా’ శరత్ ని చితక బాదారా?.. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫోటోలు..

SBI Travel Card: ఎస్‌బిఐ అదిరిపోయే ఆఫర్.. ట్రావెల్‌ కార్డ్‌‌తో క్షణాల్లో 7 రకాల కరెన్సీలు విత్‌డ్రా..!

Hyderabad: ప్రియుడితో ఏకాంతంగా బాలిక.. అది గమనించిన తల్లి వార్నింగ్.. ఆ వెంటనే ఊహించని ఘటన..!

Loading...
Unable to load recommendations.
Follow Us