Telangana: తెలంగాణ రైతులకు అలెర్ట్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లో రుణమాఫీ నగదు జమ

50 వేల రూపాయల్లోపు రుణాలున్న వారికి సోమవారం నుంచి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి..

Telangana: తెలంగాణ రైతులకు అలెర్ట్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లో రుణమాఫీ నగదు జమ
Telangana Runamafi
Follow us

|

Updated on: Aug 15, 2021 | 5:58 PM

50 వేల రూపాయల్లోపు రుణాలున్న వారికి సోమవారం నుంచి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. రెండో విడుత రుణమాఫీలో 6,06,811 మంది రైతులకు లబ్ధి చేకూరనుందని ఆయన చెప్పారు. ఇందుకోసం ఇవాళ్టి నుంచి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. 25వేల పైన తక్కువ మొత్తం ఉన్న వారితో ప్రారంభించి నెలాఖరు వరకు యాభై వేల లోపు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు.  25 వేల పైబడి 25,100 రూపాయల వరకు రుణం ఉన్న రైతుల రుణమాఫీపై ట్రయల్ జరుగుతుందని  చెప్పారు. 25వేలు, 26వేలు, 27వేలు స్లాబుల వారీగా రుణమాఫీ మొత్తం రైతుల ఖాతాల్లో జమ అవుతుందని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.  నెలాఖరు వరకు 2005 కోట్లా 85 లక్షల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని చెప్పారు. సోమవారం నుంచి రుణమాఫీ మొదలు కానున్న నేపథ్యంలో రైతు లోకానికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

సీఎం కేసీఆర్ నేతృత్వంలో 2014 నుంచి 18 వరకు 16,144 కోట్ల రైతు రుణాలు మాఫీ అయ్యాయని అన్నారు. 2018లో 25 వేలలోపు రుణాలున్న 2.96 లక్షల మంది రైతులకు 408.38 కోట్ల మేర మాఫీ అయిందని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​కు రాష్ట్ర రైతుల పక్షాన థ్యాంక్స్ చెప్పిన నిరంజన్ రెడ్డి… సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగానికి కేసీఆర్ వెన్నుదన్నుగా నిలచారని అన్నారు. ఆకలితో అలమటించిన తెలంగాణను దేశానికే అన్నపూర్ణగా నిలిపారని మంత్రి పేర్కొన్నారు. పంటల మార్పిడి వైపు రైతులను ప్రోత్సహించి తెలంగాణ వ్యవసాయాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.

Also Read: Crime News: దారుణం.. క్రూరం.. పశువులపై అత్యాచారం.. వాడు అలా.. వీడు ఇలా

 తాలిబన్లకు లొంగిపోయిన ఆఫ్గన్‌ ప్రభుత్వం.. శాంతియుతంగా అధికారం అప్పగిస్తామని ప్రకటన