Hyderabad: కోకాపేటలో ప్లాట్లను అమ్మేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌.. ధర ఎంతో తెలిస్తే షాకే..

హైదరాబాద్‌లోని కోకాపేటలో మరికొన్ని ప్లాట్లను అమ్మేందుకు సర్కాన్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. మరో 45 ఎకరాల్లో 7 ప్లాట్లను హెచ్‌ఎండీఏ విక్రయానికి వేలం వేయనుంది. ఎకరానికి కనీస ధర రూ.35 కోట్ల వరకు నిర్ణయించింది..

Hyderabad: కోకాపేటలో ప్లాట్లను అమ్మేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌.. ధర  ఎంతో తెలిస్తే షాకే..
Kokapet Land

Updated on: Jul 07, 2023 | 3:33 PM

హైదరాబాద్‌లోని కోకాపేటలో మరికొన్ని ప్లాట్లను అమ్మేందుకు సర్కాన్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. మరో 45 ఎకరాల్లో 7 ప్లాట్లను హెచ్‌ఎండీఏ విక్రయానికి వేలం వేయనుంది. ఎకరానికి కనీస ధర రూ.35 కోట్ల వరకు నిర్ణయించింది ప్రభుత్వం. అయితే కోకాపేట భూములకూ గతంలో భారీగా రికార్డు స్థాయి ధర పలుకగా, కనీస ధరకు పోయినా దాదాపు రూ.1,600 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా.

డిమాండ్ ఎక్కువ ఉండటంతో 2,500 కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఈనెల 20వ తేదీన ప్రీబిడ్ సమావేశం జరగనుంది. రిజిస్ట్రేషన్​కు నెలాఖరు వరకు అవకాశం ఉంది. ఆగస్టు 3న ‘ఈ- వేలం’ ద్వారా భూములను విక్రయం కొనసాగనుంది.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి