AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందుకే జ్యూవెలరీ షాపు పక్కనే ఉన్న గదిలోకి అద్దెకి..! చివరికి ఏం జరిగిందంటే..

బంగారు నగల దుకాణంలో చోరీకి ఇద్దరు దొంగలు మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. ఓ నగల దుకాణం పక్కనే గదిని అద్దెకు తీసుకున్నారు. ఆ తర్వాత అదను చూసి షాపు, గదికి మధ్య ఉన్న..

అందుకే జ్యూవెలరీ షాపు పక్కనే ఉన్న గదిలోకి అద్దెకి..! చివరికి ఏం జరిగిందంటే..
Jewelery Shop In Bhadradri Kothagudem
Srilakshmi C
|

Updated on: Jun 05, 2023 | 9:42 PM

Share

బంగారు నగల దుకాణంలో చోరీకి ఇద్దరు దొంగలు మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. ఓ నగల దుకాణం పక్కనే గదిని అద్దెకు తీసుకున్నారు. ఆ తర్వాత అదను చూసి షాపు, గదికి మధ్య ఉన్న గోడకు కన్నం వేసి గప్‌చుప్‌గా పనికానిచ్చాడు. ఈ షాకింగ్‌ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌లో ఆదివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

తెలంగాణ రాష్ట్రానికి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌లోని రవి కాంప్లెక్స్‌లో అలువాల శంకర్‌ తొమ్మిదేళ్లుగా జువెల్లరీ షాప్‌ నిర్వహిస్తున్నాడు. నిత్యం కస్టమర్లతో శంకర్‌ షాపు సందడిగా ఉండేది. ఐతే శంకర్‌ షాపు పక్కనే ఉన్న గదిలో మే 26న కాంప్లెక్స్‌ యజమాని ఇద్దరు యువకులకు అద్దెకు ఇచ్చాడు. ఈక్రమంలో గత నెల 31న శంకర్‌ పని నిమిత్తం హైదరాబాద్‌కి వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన ఆ ఇద్దరు దుండగులు షాపుకు, గదికి మధ్య ఉన్న గోడకు కన్నం వేశారు. ఆ తర్వాత లోపలికి ప్రవేశించారు. షాపులో ఉన్న సీసీ కెమెరాల వైర్లను కట్‌ చేశారు. ఆ తర్వాత షాపులోని దాదాపు రూ.87లక్షల విలువైన 42 కిలోల వెండి, 1242 గ్రాముల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. శంకర్‌ ఆదివారం ఉదయం తిరిగివచ్చి చూడగా షాపు ఖాళీగా ఉండటం చూసి లబోదిబోమన్నాడు.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. షాప్‌లో ఉన్న మరో సీసీ కెమెరా యాక్టివేట్గా ఉండటం గమనించి పుటేజీని పరిశీలించారు. పక్క గదిలో అద్దెకున్న యువకులే చోరీకి పాల్పడినట్లు తేలింది. జూన్‌ 1న రాత్రి 11 గంటలకు దుండగులు చోరీకి పాల్పడ్డాడని, దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయని చుంచుపల్లి సీఐ రమాకాంత్ మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్నితెలంగాణ వార్తల కోసం చేయండి.