
రాష్ట్రంలో ఉన్న సన్న, చిన్న కారు రైతులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో రేవంత్ సర్కార్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ యాంత్రీకరణ పథకం పేరుతో రైతులకు ట్రాక్టర్లు, వరికొత మిషన్లను సబ్సిడీ కింద ఇవ్వనుంది. ఇందులో భాగంగానే నేడు భద్రాద్రి కొత్తగూడెం జల్లా అశ్వారావుపేటలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ పథకాన్ని శ్రీకారం చుట్టనున్నారు. ఈ పథకం కింద ఇవాళ రైతులకు రూ.100 కోట్ల వ్యయంతో ట్రాక్టర్లు, వరి కోత మిషన్లు, స్ప్రేయర్లను సబ్సిడీపై అందించనున్నారు. ఈ పథకం కింద మహిళా రైతులకు 50శాతం, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు.
అయితే ఈ పథకం గతంలో అమల్లో ఉండగా.. ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం దీన్ని నిలిపివేసినట్టు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని మళ్లీ అందుబాటులోకి రాబోతుంది. ప్రస్తుతం పెరుగుతున్న కూలీ రేట్లు, కూలీల కొరతను అధిగమించి రైతుకు లబ్ధి చేకూరేందుకు వ్యవసాయ యంత్రాలు కీలక పాత్ర పోషిస్తాయని.. దీని ద్వారా రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆధాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించగా.. దీని ద్వారా సుమారు 1.30లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
సబ్సిడీలో రైతులకు అందనున్న యంత్రాలు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.