ఇదిలావుంటే, దేశ రాజధాని ఢిల్లీ వేదికగా టీఆర్ఎస్ కేంద్రంపై సమర శంఖం పూరించారు సీఎం కేసీఆర్. ధాన్యం కొనుగోలు చేసిన తీరాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ధాన్యాన్ని కొంటారో లేదో 24 గంటల్లో సమాధానం చెప్పాలని ప్రధాని మోదీకి, కేంద్రమంత్రి పీయూష్గోయెల్కు డెడ్లైన్ విధించారు సీఎం కేసీఆర్. లేదంటే ఏం చేయాలో తమకు తెలుసని అన్నారు. డెడ్లైన్ తరువాత తమ కార్యాచరణ చూపిస్తామని హెచ్చరించారు కేసీఆర్. రైతు ఉద్యమంతో భూకంపం సృష్టిస్తామని చెప్పారు. రైతు సమస్యలపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామంటున్నారు. ఎవరితోనైనా గొడవ పడొచ్చని.. కానీ రైతులతో పడొద్దని అన్నారు. కేంద్రాన్ని గద్దె దించే సత్తా రైతులకు ఉందన్నారు. రైతుల్ని కన్నీరు పెట్టిస్తే ఆ పాపం ఉరికేపోదని అన్నారు. తెలంగాణ రైతులు చేసిన పాపం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఎవరూ శాశ్వతంగా ఉండరని అన్నారు. తెలంగాణ ఓట్లు, సీట్లు కావాలి కానీ.. ధాన్యం వద్దా అని బీజేపీని ప్రశ్నించారు సీఎం కేసీఆర్.