
పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 3 నుంచి జరిగే పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు మంత్రి. ఈ సమాక్షా సమాశంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన, స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్లను ఈ నెల 24 వ తేదీ నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్లు, పాఠశాలలకు కూడా పంపుతున్నట్లు మంత్రితో చెప్పారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 94 వేల 616 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరువుతున్నారని, ఇందుకోసం 2,652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అధికారులకు అనేక సూచనలు చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు జరుగుతాయి. రోజూ ఉదయం 09.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని పరీక్షలు మూడు గంటలు జరిగితే, సైన్స్ పరీక్ష మాత్రం మూడు గంటల ఇరవై నిమిషాలు జరుగుతుంది. గతంలోలాగా కాకుండా ఈ సారి ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించబోతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి