AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనిక్కమ్ ఠాగూర్ తో టీ కాంగ్రెస్ లీడర్ల జూమ్ మీటింగ్

ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మనిక్కమ్ ఠాగూర్, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ పార్టీ నాయకులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ ఇంచార్జ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా..

మనిక్కమ్ ఠాగూర్ తో టీ కాంగ్రెస్ లీడర్ల జూమ్ మీటింగ్
Pardhasaradhi Peri
|

Updated on: Sep 19, 2020 | 6:31 PM

Share

ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మనిక్కమ్ ఠాగూర్, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ పార్టీ నాయకులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ ఇంచార్జ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి టీ కాంగీ నేతల్ని మనిక్కమ్ ఠాగూర్ కు పరిచయం చేసారు. పార్టీలో క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, కలిసికట్టుగా పనిచేయాలని, క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిని ఉపేక్షించవద్దని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. గ్రామాల నుంచి అన్ని స్థాయిలలో కాంగ్రెస్ నాయకులను పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని, తెలంగాణ వచ్చాక ఒక్క కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ లబ్ది పొందలేదని ఠాగూర్ కు టీ కాంగ్రెస్ నేతలు వివరించారు. రాబోయే దుబ్బాక ఉపఎన్నిక, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు, మండలి ఎన్నికలలో విజయం సాధించే దిశగా పనులు చేస్తామని నాయకులు ఠాగూర్ కు హామీ ఇచ్చారు. తెలంగాణలో పత్రికలు, మీడియా తీవ్రమైన వత్తిళ్లతో ఉందని టీకాంగీలు ఠాగూర్ కు విన్నవించారు.