Revanth Reddy: ఢిల్లీకి రేవంత్ రెడ్డి పయనం.. కాంగ్రెస్ అగ్రనేతతో ఆ అంశాలపై చర్చ..

|

Jun 25, 2023 | 6:32 PM

Revanth Reddy: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయనమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరికపై జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఇటీవల జరిగిన చర్చలు సఫలం కావడంతో.. వారికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్..

Revanth Reddy: ఢిల్లీకి రేవంత్ రెడ్డి పయనం.. కాంగ్రెస్ అగ్రనేతతో ఆ అంశాలపై చర్చ..
Revanth Reddy and Rahul-Gandhi
Follow us on

Revanth Reddy: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయనమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరికపై జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఇటీవల జరిగిన చర్చలు సఫలం కావడంతో.. వారికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఖారారయింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చిందని సమాచారం. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రమే ఢిల్లీకి పయనమై వెళ్లనున్నారు.

కాగా, రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో ముందుగా రాహూల్ గాంధీతో భేటీ అవుతారు. సోమవారం ఉదయం జరిగే ఈ సమావేశం తర్వాత కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కలుస్తారు. ఈ సందర్భంగా అగ్రనేతలతో ఈ తెలంగాణ నాయకులు పార్టీలోకి తమ చేరిక తేదీ, బహిరంగ సమావేశాలు, కార్యాచరణ వంటి పలు అంశాలపై చర్చించనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి