Private Travels‌: నల్గొండలో ప్రయాణికులకు షాక్‌.. లగేజీలతో పరారైన బస్సు డ్రైవర్‌

|

Nov 06, 2021 | 12:12 AM

Private Travels‌: ఈ మధ్య కాలంలో రకరకాల మోసాలు జరుగుతున్నాయి. మోసగాళ్లు కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుని అమాయకులను మోసగిస్తున్న..

Private Travels‌: నల్గొండలో ప్రయాణికులకు షాక్‌.. లగేజీలతో పరారైన బస్సు డ్రైవర్‌
Follow us on

Private Travels‌: ఈ మధ్య కాలంలో రకరకాల మోసాలు జరుగుతున్నాయి. మోసగాళ్లు కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుని అమాయకులను మోసగిస్తున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఇక తాజాగా ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ ప్రయాణికులను మోసగించింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రావెల్స్‌ బస్సు.. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి వద్ద భోజనం కోసం ఆగింది. ఇక భోజనం కోసం 64 మంది ప్రయాణికులు దిగారు. దీంతో ఆ బస్సు డ్రైవర్‌, క్లీనర్‌ ప్రయాణికుల లగేజీతో ఉడాయించారు. గమనించిన ప్రయాణికులు టెన్షన్‌కు గురయ్యారు. వెంటనే ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రయాణికులకు చిట్యాలలోని ఫంక్షన్‌ హాల్‌లో ఆశ్రయం కల్పించారు. ఈ 64 మంది ప్రయాణికులు కేరళ నుంచి అసోంకు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేరళకు చెందిన గ్యాంగ్ బాస్ ట్రావెల్స్‌కు చెందిన బస్సుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. బస్సు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

YouTube video player
ఇవి కూడా చదవండి:

Crime News: పండగపూట దారుణం.. ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపిన దుండగులు.. ఒకరు మృతి..

Diwali 2021: బాణసంచా కాలుస్తుండగా ప్రమాదం.. నిప్పురవ్వలు పడి అగ్నికి ఆహుతైన కారు..