తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం.. సాయం చేస్తామని సీఎంలకు హామీ ఇచ్చిన పీఎం..

|

Sep 02, 2024 | 6:59 AM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా.. వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రెండు రాష్ట్రాల్లోని దాదాపు 400 గ్రామాలు నీటిలో మునిగిపోవడంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం.. సాయం చేస్తామని సీఎంలకు హామీ ఇచ్చిన పీఎం..
Chandrababu Naidupm Narendra Modirevanth Reddy
Follow us on

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా.. వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రెండు రాష్ట్రాల్లోని దాదాపు 400 గ్రామాలు నీటిలో మునిగిపోవడంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ విపత్తు కారణంగా ట్రాఫిక్ వ్యవస్థ కూడా పూర్తిగా స్తంభించిపోయింది.

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా, వర్షాలు, వరదల దృష్ట్యా రెండు రాష్ట్రాల్లోని పరిస్థితి గురించి ముఖ్యమంత్రుల నుంచి ప్రధాని సమాచారం తీసుకున్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

పరిస్థితిపై ముఖ్యమంత్రుల ఫోకస్..

బుడ్మేరు వాగు పొంగడంతో పరిస్థితి దారుణంగా తయారైందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు. వేలాది మంది ప్రజలు ఇళ్లు, పైకప్పులపై చిక్కుకుపోయారు. ప్రతి గంటకూ పరిస్థితిని గమనిస్తూనే ఉంటామని, పర్యవేక్షిస్తానని సీఎం చెప్పారు. గత ప్రభుత్వం బుడ్మేరు కాలువను నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ విపత్తు సంభవించిందని అన్నారు.

ఇవి కూడా చదవండి

‘ప్రజలకు సహాయం అందిస్తాం’

ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని సీఎంలు తెలిపారు. బోట్ల ద్వారా ప్రజలకు ఆహారంతోపాటు ఇతర నిత్యావసర వస్తువులను అందజేస్తామని వారు తెలిపారు. వైద్య సహాయం అవసరమైన వారిని తరలించేందుకు పడవలను కూడా ఉపయోగిస్తామని, ప్రభుత్వం ప్రజలకు హెల్ప్‌లైన్ నంబర్లను అందిస్తోందని, మొత్తం కార్యాచరణను పర్యవేక్షిస్తానని సీఎంలు తెలిపారు. మరిన్ని బోట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, అదనంగా ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను రప్పిస్తామని వారు తెలిపారు.

సాయం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ..

అంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులతో మాట్లాడి రెండు రాష్ట్రాల్లో వరద పరిస్థితిని సమీక్షించారు. వర్షాలు, వరదలను ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి అన్ని విధాలా సాయం చేస్తామని షా రెండు రాష్ట్రాలకు హామీ ఇచ్చారు. వరద ప్రభావిత రాష్ట్రాల సీనియర్ అధికారులతో హోం మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతోందని, వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాలను రంగంలోకి దించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.

ఇప్పటి వరకు 9 మంది మృతి..

వర్షాభావ ప్రాంతాల నుంచి తరలించిన ప్రజల కోసం ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 100 సహాయ, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతోపాటు 61 వైద్య శిబిరాల ఏర్పాట్లు కూడా చేశారు. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 9 మంది చనిపోయారు. పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు నీట మునిగిన 600 మందిని రక్షించాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..