AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వింత వైరస్‌తో 30 వేల కోళ్లు మృతి.. డేంజరే!

ఇప్పటికే కరోనా వైరస్‌తో ప్రపంచమంతా గడగడలాడిపోతుంది. దీంతో.. ఇండియా వ్యాప్తంగా ప్రజలు చికెన్ తినడం మానేశారు. దీంతో చికెన్ బిజినెస్ బాగా పడిపోయింది. అయితే చికెన్ వ్యాపారంపై మరో కొత్త వైరస్ ఎటాక్ చేసింది. ఈ వింత వైరస్‌తో ఏకంగా 30 వేల కోళ్లు మృతి..

వింత వైరస్‌తో 30 వేల కోళ్లు మృతి.. డేంజరే!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 24, 2020 | 6:45 AM

Share

Crime News: ఇప్పటికే కరోనా వైరస్‌తో ప్రపంచమంతా గడగడలాడిపోతుంది. దీంతో.. ఇండియా వ్యాప్తంగా ప్రజలు చికెన్ తినడం మానేశారు. దీంతో చికెన్ బిజినెస్ బాగా పడిపోయింది. అయితే చికెన్ వ్యాపారంపై మరో కొత్త వైరస్ ఎటాక్ చేసింది. ఈ వింత వైరస్‌తో ఏకంగా 30 వేల కోళ్లు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బయ్యన గూడెంలో చోటుచేసుకుంది. దీంతో పౌల్ట్రీ రంగ రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకీ కోళ్ల మృతి సంఖ్య పెరుగుతుందే కానీ.. ఆ వైరస్ ఏంటనేది అర్థకావడం లేదని యజమానులు తలలు బాదుకుంటున్నారు. ఎన్నో లక్షలు ఖర్చుపెట్టి ఈ కోళ్ల పారాలను నడిపిస్తుంటే.. నష్టం మాత్రమే మిగులుతుందని ఆవేదన చెందుతున్నారు.

ఈ ఘటనపై తహశీల్దార్ రవికూర్ స్పందించారు. ఈ మధ్య కోళ్లకి వింత వైరస్ సోకిందని, డాక్టర్లు టెస్ట్ చేసినా ఆ వైరస్ ఏంటనేది కనిపెట్టలేకపోతున్నారన్నారు. తాజాగా.. ఓ 30 వేల కోళ్లు చనిపోయన్నారు. అయితే ఇలా చనిపోయిన కోళ్లని అగ్రహారం గ్రామం దగ్గర్లని చెరువులో గోతులు తీసి వేస్తున్నారు. వాటిపై మట్టిని పూడ్చకపోవటంతో.. కుక్కలు పీక్కుతింటున్నాయి. ఫలితంగా దుర్వాసన వస్తోందని నాయకుల గూడెం ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ మధ్యే చైనాలో కూడా వైరస్ సోకి కోళ్లు మృతి చెందాయి. అలాగే ఇక్కడ కూడా జరుగుతుందోమోనని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు.