Kamareddy: కామారెడ్డిలో దారుణం.. లాడ్జీలో నిప్పంటించుకుని తల్లీకుమారుడు బలవన్మరణం

Mother, Son Burnt to Death: తెలంగాణలోని కామారెడ్డి జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. న్యూ మహారాజా లాడ్జిలోని ఓ గదిలో తల్లీకుమారుడు ఇద్దరూ నిప్పంటించుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.

Kamareddy: కామారెడ్డిలో దారుణం.. లాడ్జీలో నిప్పంటించుకుని తల్లీకుమారుడు బలవన్మరణం
Fire
Follow us

|

Updated on: Apr 16, 2022 | 10:29 AM

Mother, Son Burnt to Death: తెలంగాణలోని కామారెడ్డి జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. న్యూ మహారాజా లాడ్జిలోని ఓ గదిలో తల్లీకుమారుడు ఇద్దరూ నిప్పంటించుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున జరిగింది. గది నుంచి పొగలు రావడాన్ని గమనించిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. మృతులు తల్లి పద్మ, కుమారుడు సంతోష్‌ రామాయంపేట్‌ వాసులుగా గుర్తించారు. తల్లి వైద్యం చేయించేందుకు ఈ నెల 11న కామారెడ్డి (kamareddy) లోని లాడ్జికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెల్లవారుజామున ఇద్దరూ నిప్పటించుకోని మరణించడం కలకలం రేపింది. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ సోమనాథం పోలీసులు పరిశీలించారు. ఈ సందర్భంగా పలు వివరాలు సేకరించారు. కాగా.. తల్లీ కుమారుడు ఆత్మహత్యకు ముందు వీడియో చిత్రీకరించారు. దీనిని సంతోష్, పద్మ ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. తమ ఆత్మహత్యకు ఏడుగురు కారణం అంటూ ఐదు పేజీల లేఖ కూడా రాశారు. రామాయంపేట చైర్మన్ జితేందర్ గౌడ్ సహా ఏడుగురు వేధించినట్లు పేర్కొన్నారు.

వ్యాపారం, ఆర్థిక లావాదేవీల్లో 50శాతం కావాలంటూ వేధించారని సంతోష్ పేర్కొన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వీడియోలో వెల్లడించాడు సంతోష్.. కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే.. జితేందర్ గౌడ్, సంతోష్ మధ్య ఆర్థిక లావాదేవీల్లో గొడవలు జరుగుతున్నట్లు పేర్కొంటున్నారు.

కాగా.. రూమ్ నెంబర్ 203లో తెల్లవారు జామున పొగలు రావడంతో పక్క రూమ్ వ్యక్తి రిసిప్షన్లో చెప్పాడు. దీంతో సిబ్బంది పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించినట్లు లాడ్జీ సిబ్బంది పేర్కొన్నారు.

Also Read:

AP Crime: కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి యువతి ట్రాప్.. ఆ తర్వాత ఫొటోలు తీసి..

ప్రాణం తీసిన ఈత సరదా.. రిజర్వాయర్ లో మునిగి ఇద్దరు విద్యార్థులు దుర్మరణం