Rythu Bandhu: రేపటి నుంచి పది రోజుల పాటు రైతుబంధు సంబురాలు.. గులాబీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపు..

|

Jan 02, 2022 | 9:07 PM

తెలంగాణలో సోమవారం నుంచి పది రోజుల పాటు రైతుబంధు సంబురాలు నిర్వహించుకోవానలి తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌..

Rythu Bandhu: రేపటి నుంచి పది రోజుల పాటు రైతుబంధు సంబురాలు.. గులాబీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపు..
Telangana Minister KTR
Follow us on

Minister KTR – Rythu Bandhu: తెలంగాణలో సోమవారం నుంచి పది రోజుల పాటు రైతుబంధు సంబురాలు నిర్వహించుకోవానలి తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు. రైతుల ఖాతాల్లో రూ.50వేలకోట్లు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందించనున్న నేపథ్యంలో ఆదివారం కేటీఆర్‌ టెలీకాన్ఫరెన్స్‌  ద్వారా ఈ విరాలను వెల్లడించారు. టీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, రైతుబంధు అధ్యక్షులు, డీసీఎంఎస్‌ చైర్మన్లతో జరిగిన టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి కేటీఆర్‌ రైతుబంధు సంబురాలుపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఏనాడు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి చరిత్రలో ఎన్నడూ చరిత్రలో ఎన్నడూ ఆలోచించని స్థాయిలో.. తెలంగాణ రైతుల గురించి సీఎం కేసీఆర్ ఆలోచించారని అన్నారు. ఇందులో భాగంగా   గొప్ప కార్యక్రమం రైతుబంధు అని వెల్లడివంచారు. ఈ పథకం ప్రారంభమైనాటి నుంచి ఈ నెల 10 నాటికి రూ.50వేలకోట్లు రైతుల ఖాతాల్లోకి జమకాబోతున్నాయన్నారు. రైతుబంధు కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి రైతాంగం ఎనలేని సంతోషంతో ఉందని అన్నారు మంత్రి కేటీఆర్‌. రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఓ గొప్ప ఊతరంగా మారిందన్నారు. ఇలా రూ.50వేలకోట్లు రైతుల ఖాతాల్లోకి చేరిన సందర్భంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేదని.. ఇది అద్భుతమైన సందర్భం అన్నారు. ఇలాంటి చారిత్రక సందర్భాన్ని అంతా సెలబ్రేట్‌ చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. దేశ చరిత్రలో ఏ సీఎం, పీఎం చేయలేనంత గొప్ప కార్యక్రమాలను వ్యవసాయ రంగం కోసం రైతన్నల కోసం కేసీఆర్ చేశారన్నారు.

సోమవారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు వారం రోజుల పాటు రైతుబంధు ఉత్సవాలను నిర్వహించాలని శ్రేణులకు కేటీఆర్‌ సూచించారు. తాజాగా ప్రభుత్వం కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో విధించిన పరిమితులను గుర్తించుకొని సంబురాలు నిర్వహించాలని, ఎమ్మెల్యేలు ఈ విషయంలో ముందుండి నియోజకవర్గ పార్టీ శ్రేణులందరినీ కలుపుకొని ముందుకెళ్లాలని సూచించారు.

ఇవి కూడా చదవండి: Early Election: తెలుగు రాష్ట్రాల్లో కొత్త రచ్చ.. ముందస్తు ప్రచారంపై అధికార పక్షాల ఫైర్..

Viral Video: వామ్మో..! ఇది మైకేల్ జాక్సన్‌ను మించిపోయిందే.. సోషల్ మీడియాను కుదిపేస్తున్న పావురం డ్యాన్స్..