
నల్గొండ జిల్లా చర్లపల్లికి చెందిన సౌందర్యకు మిర్యాలగూడ మండలం బంగారిగడ్డకు చెందిన సాయిదీప్కు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి దీంతో ఇద్దరు ప్రేమించుకున్నారు. దళితురాలైన సౌందర్యతో వివాహం సాయిదీప్ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. అయినా సాయిదీప్ పెళ్లి చేసుకుని మిర్యాలగూడలో బైక్ మెకానిక్గా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. వీరికి నాలుగేళ్ల బాబు కూడా ఉన్నాడు. అయితే ఇటీవల సాయిదీప్ వేరే యువతితో ఫోన్లో తరచుగా మాట్లాడుతుండటాన్ని సౌందర్య గమనించింది. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో కొద్దిరోజుల క్రితం సాయిదీప్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
భర్త కోసం సౌందర్య ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. తన భర్త కనిపించడం లేదంటూ మిర్యాలగూడ పోలీస్ స్టేషన్లో సౌందర్య ఫిర్యాదు చేసింది. అయినా ఆచూకీ లేదు. మిర్యాలగూడ పట్టణం బంగారుగడ్డలోని భర్త ఇంటికి కొడుకును తీసుకుని వెళ్ళింది. అయితే సాయిదీప్ కుటుంబ సభ్యులు సౌందర్యను ఇంట్లోకి అనుమతించలేదు. గేటుకు తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ నాలుగేళ్ల కొడుకుతో కలిసి భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. కొద్దిరోజులుగా తన భర్త కనిపించడం లేదని ఆరా తీస్తే తనను వదిలించుకునేందుకు.. భర్త, అతడి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేసిన భర్త నుంచి న్యాయం చేయాలని పోలీసులు కోరుతోంది. సౌందర్య ఆందోళనకు ప్రజాసంఘాలు కూడా మద్దతు పలికాయి.