భార్య గొంతు కోసి భర్త ఆత్మహత్య.. తృటిలో తప్పించుకొని పారిపోయిన చిన్నారులు

|

May 20, 2023 | 10:45 AM

ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు కాల్ చేశారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు.. మృతదేహాల్ని పోస్ట్ మార్టం కోసం పంపారు. కుటుంబకలహాల నేపథ్యంలోనే భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

భార్య గొంతు కోసి భర్త ఆత్మహత్య.. తృటిలో తప్పించుకొని పారిపోయిన చిన్నారులు
Women Murder
Follow us on

ఓ భర్త తన భార్యను కిరాతకంగా హత్య చేసి.. ఆ తర్వాత తనూ ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో  చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు వారి ఇద్దరు పిల్లలు అక్కడ్నుంచి తప్పించుకుని పారిపోయినట్టుగా తెలిసింది.  రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం జన్వాడలో దారుణం జరిగింది. భార్యను నరికి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు భర్త. శంకర్‌పల్లి మండలం జన్వాడలో ఈ దారుణం చోటు చేసుకుంది. శంకర్‌పల్లి మండలం జన్వాడలో నివసిస్తున్నారు ఆర్ఎంపీ డాక్టర్ నాగరాజు దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.

అయితే ఏదో విషయంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ తారస్థాయికి చేరడంతో నాగరాజు.. భార్య గొంతుకోసి హతమార్చాడు. తల్లిని చంపుతుండగా అడ్డొచ్చిన పెద్ద కుమారుడు దీక్షిత్‌నూ హత్య చేసేందుకు నాగరాజు ప్రయత్నించాడు. దీంతో బాలుడు దీక్షిత్‌ తన తమ్ముడిని తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. భార్యను హత్య చేసిన అనంతరం నాగరాజు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు కాల్ చేశారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు.. మృతదేహాల్ని పోస్ట్ మార్టం కోసం పంపారు. కుటుంబకలహాల నేపథ్యంలోనే భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..