AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి హామిపై మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నారంటే..?

తెలంగాణ రాజకీయాలు, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వివరించారు. గత ప్రభుత్వ అప్పులు, భూముల విక్రయాలపై స్పందిస్తూ, సంక్షేమ పథకాల అమలుకు ప్రస్తుత చర్యలు అవసరమని పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన హామీ, 22ఏ భూముల సమస్య, ప్రతిపక్షాల ఆరోపణలపై పార్టీ స్థానాన్ని స్పష్టం చేశారు.

రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి హామిపై మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నారంటే..?
Mahesh Kumar Goud
Ram Naramaneni
|

Updated on: Aug 29, 2026 | 9:11 PM

Share

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ క్రాస్ ఫైర్ కార్యక్రమంలో తెలంగాణ రాజకీయాలు, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లపై సమగ్రంగా మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు, భూముల విక్రయాలను ప్రస్తావిస్తూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే మార్గంలో నడుస్తోందన్న విమర్శలపై స్పందించారు. అప్పు కట్టడానికి అప్పు చేసే పరిస్థితి ఏర్పడిందని, ఎనిమిది లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు ఉన్నాయని తెలిపారు. సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నప్పుడు, పేదల కడుపు నింపాలన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సి వస్తుందని సమర్థించుకున్నారు. బీఆర్‌ఎస్ వందల ఎకరాలు అమ్మితే, తాము అవసరానికి సరిపడా వందల ఎకరాలు అమ్ముతున్నామని తేడాను వివరించారు. ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై 30% కమీషన్ల ఆరోపణలు చేస్తున్నాయని, ఇది నిరాధారమని మహేష్ కుమార్ గౌడ్ కొట్టిపారేశారు. ఈ ఆరోపణలకు ఎలాంటి రుజువులు లేవని, కోటి రూపాయల పని చేస్తే కాంట్రాక్టర్‌కు మిగిలేది 20-30% మాత్రమేనని అన్నారు. ఏఐసీసీకి నిధులు తరలిస్తున్నారన్న ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నిధులు బీజేపీతో పోలిస్తే 5% కూడా లేవని, తమ గాంధీ భవన్ ఖాతాలో లక్షల్లోనే నిధులు ఉంటాయని తెలిపారు.

రాహుల్ గాంధీ గారికి డబ్బు ఆశ లేదని, ఆయన కుటుంబం ఆస్తులు, ప్రాణాలు త్యాగం చేసిన కుటుంబం అని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో ఎదురవుతున్న సవాళ్లను మహేష్ కుమార్ గౌడ్ అంగీకరించారు. పరిమిత బడ్జెట్‌లో హామీలను తీర్చే ప్రయత్నం చేస్తోందని, ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపారు. పార్టీ నాయకులకు ఇచ్చిన హామీల విషయంలోనూ ఇదే పరిస్థితి అని అన్నారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని ఇచ్చిన హామీపై మాట్లాడుతూ, సమయం పట్టొచ్చని, రాజకీయాల్లో ఓపిక అవసరమని రాజగోపాల్ రెడ్డికి కూడా చెప్పానని అన్నారు. అన్న క్యాబినెట్‌లో ఉన్నాడని పదవి ఇవ్వడం లేదన్న వాదనను అంగీకరించారు. కొండా సురేఖ వంటి లీడర్స్‌కు పదవి ఇవ్వకపోవడం పెద్ద తప్పు అవుతుందని, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని పార్టీ అనే ముద్ర పడే అవకాశం ఉందని ఆయన పరోక్షంగా అంగీకరించారు. సెప్టెంబర్ మాసంలో చిన్నపాటి సమస్యలన్నీ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు, ముఖ్యమంత్రి, మంత్రుల కుటుంబ సభ్యులపై వస్తున్న విమర్శలు నిరాధారమని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పిసిసి అధ్యక్షుడిపై ఆరోపణలు వస్తే తోటి మంత్రులు రెస్క్యూకి రావడం లేదన్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు, తాను రెస్క్యూకి వస్తున్నానని, తన డ్యూటీ చేస్తున్నానని తెలిపారు. 22ఏ భూముల సమస్యపై ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి, రెవెన్యూ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పారని, తప్పులను సరిదిద్దారని ఆయన వెల్లడించారు. ధరణి వల్ల గతంలో సామాన్యులు పడిన ఇబ్బందులు పునరావృతం కాకుండా చూసుకున్నామని, చిన్న లోపాలు జరిగినప్పటికీ వాటిని తక్షణమే సరిదిద్దగలిగామని ఆయన స్పష్టం చేశారు.

Follow Us