మనస్తాపంతో ప్రేమ జంట ఆత్మహత్య

|

Sep 21, 2019 | 1:51 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. పెద్దలు తమ పెళ్లికి నిరాకరిస్తారేమోననే మనస్తాపంతో ప్రేమజంట ఆత్మహత్యానికి పాల్పడింది. జూలూరుపాడు మండలం ,అన్నారుపాడు గ్రామానికి చెందిన గూగులోత్ గోపీచంద్ (22) అదే గ్రామానికి చెందిన లావుడియా సింధు (21) ఇద్దరూ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబాల వారు  కాదంటారేమో అనే భయంతో ఇద్దరూ కలిసి చచ్చిపోవాలనుకున్నారు. శుక్రవారం రాత్రి ఇంట్లో నుండి బయల్దేరిని గోపీచంద్‌, సింధు గ్రామంలోని పొలాల్లోకి వెళ్లి పురుగుల […]

మనస్తాపంతో ప్రేమ జంట ఆత్మహత్య
Follow us on

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. పెద్దలు తమ పెళ్లికి నిరాకరిస్తారేమోననే మనస్తాపంతో ప్రేమజంట ఆత్మహత్యానికి పాల్పడింది. జూలూరుపాడు మండలం ,అన్నారుపాడు గ్రామానికి చెందిన గూగులోత్ గోపీచంద్ (22) అదే గ్రామానికి చెందిన లావుడియా సింధు (21) ఇద్దరూ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబాల వారు  కాదంటారేమో అనే భయంతో ఇద్దరూ కలిసి చచ్చిపోవాలనుకున్నారు. శుక్రవారం రాత్రి ఇంట్లో నుండి బయల్దేరిని గోపీచంద్‌, సింధు గ్రామంలోని పొలాల్లోకి వెళ్లి పురుగుల మందు తాగారు..అనంతరం తమ ఆత్మహత్య విషయాన్ని ఇరు కుటుంబాల వారికి ఫోన్ చేసి చెప్పారు.  దీంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు పొలాల్లోకి వెళ్లి చూడగా అప్పటికే ఇద్దరూ విగత జీవులుగా పడివున్నారు. మృతిచెంది ఉన్నారు. మృతదేహాలను గ్రామానికి తరలించిన కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు గ్రామంలోని పలువురి విచారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.