సెల్ఫీ దిగుతుండగా కాలుజారి కాలువలో.. శ్రమించి కాపాడిన స్థానికులు..!

| Edited By: Balaraju Goud

Aug 30, 2024 | 6:40 PM

యువతకు సోషల్ మీడియా పిచ్చి బాగా ముదురుతోంది. ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఎక్కడబడితే అక్కడ వీడియోలు చేస్తూ చావు కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ సరదా సెల్ఫీ కోసం ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. రెప్పపాటులో ప్రాణాలతో బయటపడంది.

సెల్ఫీ దిగుతుండగా కాలుజారి కాలువలో.. శ్రమించి కాపాడిన స్థానికులు..!
Woman Selfie
Follow us on

యువతకు సోషల్ మీడియా పిచ్చి బాగా ముదురుతోంది. ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఎక్కడబడితే అక్కడ వీడియోలు చేస్తూ చావు కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ సరదా సెల్ఫీ కోసం ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. రెప్పపాటులో ప్రాణాలతో బయటపడంది. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో వెలుగు చూసింది.

ఓ మహిళ సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడింది. వెంటనే స్పందించిన స్థానికులు, ఆ మహిళను శ్రమించి ప్రాణాలతో కాపాడారు. ఈ ఘటన నల్గొండ జిల్లా వేములపల్లి మండలం కేంద్రంలోని ఎడమ కాలువ వద్ద చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న ఓ ఫ్యామిలీ సరదగా చుద్దామని.. నాగార్జునసాగర్ ఎడమ కాలువ వద్దకు వెళ్లారు. అయితే అక్కడ తన భర్త, తమ్ముడు, కూతురుతో కలిసి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించారు. ఇంతలో ప్రమాదవశాత్తు మహిళ కాలు జారి కాలువలో పడింది. వెంటనే గమనించిన స్థానికులు తాళ్ల సాయంతో ఆ మహిళను కాపాడారు. ఆమెను కాపాడేందుకు దాదాపుగా 40 నిమిషాల పాటు కష్టపడ్డారు. మహిళను ప్రాణాలతో బయట పడటంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఊపిరి పిల్చుకున్నారు.

వీడియో చూడండి… 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…