AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖరీఫ్ సీజన్‌కు సరిపడా ఎరువులు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన!

ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణ రాష్ట్రానికి ఎరువుల కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇంధన మార్కెట్లలో అస్థిరత మరియు ప్రధాన ఉత్పత్తి దేశాల నుండి ఎగుమతులు తగ్గినప్పటికీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం దేశీయంగా ఎరువుల కొరత రాకుండా అచంచలమైన నిబద్ధతతో పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖరీఫ్ సీజన్‌కు సరిపడా ఎరువులు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన!
Union Minister Kishan Reddy
Balaraju Goud
|

Updated on: Jun 26, 2026 | 6:15 PM

Share

ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణ రాష్ట్రానికి ఎరువుల కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇంధన మార్కెట్లలో అస్థిరత మరియు ప్రధాన ఉత్పత్తి దేశాల నుండి ఎగుమతులు తగ్గినప్పటికీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం దేశీయంగా ఎరువుల కొరత రాకుండా అచంచలమైన నిబద్ధతతో పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.

స్పాట్ మార్కెట్ల నుండి సహజ వాయువును సేకరించి దేశీయంగా యూరియా ఉత్పత్తిని పెంచామని మంత్రి తెలిపారు. సకాలంలో దిగుమతులు చేసుకోవడం ద్వారా తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా యూరియా, DAP, NPK ఎరువుల తగినంత లభ్యత ఉందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. గత రబీ 2025-26 సీజన్‌లో కూడా అంచనా వేసిన అవసరం కంటే ఎక్కువ సరఫరాను కేంద్రం అందించనున్నట్లు వెల్లడించారు:

రబీ 2025-26 సీజన్‌లో, 10.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ప్రాథమిక అవసరానికి గాను, భారత ప్రభుత్వం 12.01 LMT అందుబాటులోకి తీసుకువచ్చింది. 1.45 LMT DAP అవసరానికి గాను కేంద్రం 2.55 LMT సరఫరా చేయగా, 7.00 LMT NPK అవసరానికి గాను 9.47 LMT ఎరువులను అందుబాటులో ఉంచింది. రైతులు ఎటువంటి అంతరాయం లేకుండా, అంచనా వేసిన అవసరం కంటే ఎక్కువ సరఫరా చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుత ఖరీఫ్ 2026 సీజన్‌లోనూ ఇదే చొరవతో నిరంతర పర్యవేక్షణ ద్వారా నిల్వలను సమృద్ధిగా నిర్వహిస్తోందన్నారు.

గత రబీ సీజన్‌లో రామగుండం ఫెర్టిలైజర్స్, కెమికల్స్ లిమిటెడ్ (RFCL) ప్లాంట్‌లో ఎదురైన సమస్యలను కేంద్రం పూర్తిగా పరిష్కరించింది. ప్రస్తుతం ఈ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుండటంతో తెలంగాణ రైతులకు సజావుగా, సకాలంలో ఎరువుల సరఫరా అందుతోందని మంత్రి తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వానిదే పంపిణీ బాధ్యత

కేంద్ర ప్రభుత్వం ఎరువుల తగినంత కేటాయింపును నిర్ధారించినప్పటికీ, క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన పంపిణీ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలవారీగా ఎరువులను సమానంగా పంపిణీ చేయాలని, రాయితీ ఎరువులను వ్యవసాయేతర అవసరాలకు మళ్లించకుండా నిరోధించాలని ఆయన కోరారు. అలాగే అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను ఉక్కుపాదంతో అణచివేస్తూ ప్రతి నిజాయితీగల రైతుకు ఎరువులు సకాలంలో అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us