16 ఎంపీ స్థానాలు మనవే- కల్వకుంట్ల కవిత

| Edited By: Srinu

Apr 04, 2019 | 6:44 PM

నిజామాబాద్‌: తెలంగాణ రాష్ట్రం తరహాలో.. దేశం సమగ్ర అభివృద్ధి జరగాలంటే 16 ఎంపీ స్థానాల్లో టిఆర్ఎస్‌నే  గెలిపించాలని నిజామాబాద్‌ ఎంపీ కవిత ప్రజలను కోరారు. గెలుస్తామన్న నమ్మకం కూడా నాయకుల్లో..కార్యకర్తల్లో ఉందని ఆవిడ అన్నారు. రాష్ట్రానికి కావాల్సిన నిధుల్ని తీసుకొచ్చే సత్తా గులాబీ ఎంపీలకే ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఒక మునిగిపోయిన నావ అని ఎద్దేవా చేశారు. ఏడాదిలో కాళేశ్వరం నీటితో గ్రామాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. నిజామాబాద్‌ జిల్లాలోని ఇందల్వాయి, దర్పల్లి మండలాల్లో  ఎమ్మెల్యే బాజిరెడ్డితో కలిసి […]

16 ఎంపీ స్థానాలు మనవే- కల్వకుంట్ల కవిత
Follow us on

నిజామాబాద్‌: తెలంగాణ రాష్ట్రం తరహాలో.. దేశం సమగ్ర అభివృద్ధి జరగాలంటే 16 ఎంపీ స్థానాల్లో టిఆర్ఎస్‌నే  గెలిపించాలని నిజామాబాద్‌ ఎంపీ కవిత ప్రజలను కోరారు. గెలుస్తామన్న నమ్మకం కూడా నాయకుల్లో..కార్యకర్తల్లో ఉందని ఆవిడ అన్నారు. రాష్ట్రానికి కావాల్సిన నిధుల్ని తీసుకొచ్చే సత్తా గులాబీ ఎంపీలకే ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఒక మునిగిపోయిన నావ అని ఎద్దేవా చేశారు. ఏడాదిలో కాళేశ్వరం నీటితో గ్రామాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. నిజామాబాద్‌ జిల్లాలోని ఇందల్వాయి, దర్పల్లి మండలాల్లో  ఎమ్మెల్యే బాజిరెడ్డితో కలిసి కవిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిరుపేదలకు వంద శాతం రాయితీతో రుణాలిస్తామని హామీ ఇచ్చారు. ఆయా గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించి స్థానిక సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రైతులు మూకుమ్మడి నామినేషన్లపై స్పందించిన కవిత ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేసుకోవచ్చు అన్నారు.