Telangana: ఆ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీలో లొల్లి.. లోకల్ నేతలు వేధిస్తున్నారంటూ మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు

స్థానిక నేతలపై సంచలన ఆరోపణలు చేశారు స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలం జానకిపురం సర్పంచ్ కుర్చపల్లి నవ్య. పార్టీలో తగిన గౌరవం- గుర్తింపు ఇవ్వకుండా తనను వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

Telangana: ఆ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీలో లొల్లి.. లోకల్ నేతలు వేధిస్తున్నారంటూ మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు
Sarpanch Navya

Updated on: Mar 10, 2023 | 11:13 AM

తెలంగాణలోని స్టేషన్ ఘన్‌పూర్ లో బీఆర్ఎస్ అంతర్గత కలహాలు సంచలనం సృష్టిస్తున్నాయి. తనకు పార్టీలో తగిన గౌరవం లభించడం లేదని.. మహిళలను అని చాలా చిన్న చూపు చూస్తున్నారంటూ సర్పంచ్ నవ్య సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాదు కొందరు నాయకులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు గుర్తింపు ఇవ్వకుండా కార్యకర్తలు కూడా వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయింది. వివరాల్లోకి వెళ్తే..

స్థానిక నేతలపై సంచలన ఆరోపణలు చేశారు స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలం జానకిపురం సర్పంచ్ కుర్చపల్లి నవ్య. పార్టీలో తగిన గౌరవం- గుర్తింపు ఇవ్వకుండా తనను వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కొందరు బీఆర్ఎస్ నేతల తీరు వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని చెప్పారు. మహిళల పట్ల నేతలు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సర్పంచ్ నవ్య. స్థానిక నేతల తీరుపై సీఎం కేసీఆర్, కేటీఆర్ లకు కంప్లైంట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు సర్పంచ్ నవ్య. ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు రాక ఒంటిపై బంగారం, ఆస్తులు అమ్ముకున్నామని చెప్పారు. తమ గ్రామంలో తనను ఇబ్బందిపెట్టే నాయకులెవరో చెప్పారు జానకిపురం సర్పంచ్ నవ్య. రాష్ట్ర స్థాయి నాయకులు కాదని క్లారిటీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us