తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలకు సంబందించి కోద్ది రోజులగా చాల ఇంట్రేస్టింగ్ విషయాలు కనిపిస్తున్నాయి. గత కోద్ది రోజులుగా సీఎం రేవంత్ సచివాలయానికి దూరంగా ఉండటం ఇప్పుడు హట్ టాఫిక్ గా మారుతుంది. సచివాలయం నుండి కాకుండా ముఖ్యమైన రీవ్యూలు పోలిస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుండి చేయడం ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తి రేపుతుంది. దీనికి ప్రధాన కారణం సచివాలయంలో వాస్తు మార్పులేనా..? అందుకే సీఎం మరో అల్టార్నేటివ్ ను ఆలోచించారా..? అవునా అంటే తాజ ఉదహరణలు అవుననే అనిపిస్తున్నాయి. అసలు తెలంగాణ సచివాలయంలో ఏం జరుగుతుంది.
వారం రోజుల క్రితమే తెలంగాణ సచివాలయంలో మార్పులు
వారం రోజుల క్రితమే తెలంగాణ సచివాలయంలో మార్పులు, చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా సీఎం కాన్వాయ్ ఎంట్రీ ప్రధాన ద్వారాన్ని మార్చబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇకపై సచివాలయం వెస్ట్ గేట్ (పశ్చిమ) నుంచి కాన్వాయ్కు ఎంట్రీ ఉండనుందట. ఈస్ట్ గేట్ నుంచి సీఎం కాన్వాయ్ బయటికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఐఏఎస్, ఐపీఎస్.. ఇతర అధికారులు మాత్రం ఈస్ట్ గేటు నుంచి ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. దీనిలో బాగాంగానే సచివాలయ సింహ ద్వారం అయిన ముందు గేటును మూసివేసారు అధికారులు. రేవంత్ సీఎం అయ్యాక తనదైన శైలిలో మార్పులు, చేర్పులకు శ్రీకారం చుడుతున్నారు. తొలుత పీసీసీ అధ్యక్ష పదవి వచ్చాక వాస్తుకు తగినట్లుగా గాంధీ భవన్లో మార్పులు చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.
ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుండి సమీక్షలు
ఇక ఈ వార్త బయటకి వచ్చినప్పటి నుండి పలు సంఘటనలు దీనికి బలం చేకూర్చుతున్నాయి.. సీఎం గత కోద్ది రోజులుగా ముఖ్యమైన సమీక్షలు బంజారహిల్స్ లోని ఇంటిగ్రేటేడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుండి నిర్వహిస్తున్నారు. దీనిలో భాగాంగనే గత కోద్ది రోజులుగా ముఖ్యమైన మీటింగ్ లు మినహ సమీక్ష సమావేశాలు సిఎం నివాసం నుండి లేదా, ఐసిసిసి నుండి చేస్తున్నారు.ఇక ఈ రోజు సైతం సీఎం మంత్రులు హజరయిన రేండు రీవ్యూలను ఐసిసిసి నుండే చేసారు. ఇక మాములుగా డిజస్టార్ మెనేజ్మెంట్, వర్షాలు వరదాలపై సమీక్ష అంటే ఐసిసిసి అంటే ఒకే కాని ఇప్పుడు వ్యవసాయ శాఖ, సహకార శాఖ రీవ్యూ కూడ అక్కడి నుండే నిర్వహించడంతో కోన్ని వాదనలకు బలం చేకూరుతున్నాయి.
ఇక బయట మార్పులాగానే సచివాలయం లోపల కూడ కోన్ని మార్పులు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. నిజానికి సచివాలయం చాల ఇరుక్కుగా, ఇబ్బంది కరంగా ఉంది అని మొదటి నుండి మంత్రులు, అధికారులకు ఓపినియన్ ఉంది. దీంతో ఇప్పుడు దానికి తోడు రీవ్యూ చేయలంటే ఇక్కడ అనుకూలంగా లేదు అనే ప్రచారం జరుగుతుంది. దీంతో పాటుగా సీఎం చాంబర్ లో పలు మార్పులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ వాడినే చాంబర్లనే ప్రస్తుత ముఖ్యమంత్రి, మంత్రులు వాడుతున్నారు. దీంతో వాటిలో ఉన్న ఇబ్బందులు, వాస్తు విషయంలో కూడ కోన్ని మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
సోమవారం ఒక రీవ్యూ జరిగిన తర్వాత ఓ కార్యక్రమంలో పాల్గోనడానికి రవీంద్ర బారతి వరకు వచ్చిన సీఎం సచివాలయానికి కాకుండా మళ్లి తిరిగి ఐసిసిసి కి వెళ్లి అక్కడే వ్యవసాయం పై రీవ్యూ నిర్వహించారు. దీంతో ఈ వాదనకు బలం చేకూరుతుంది.
మొత్తానికి సీఎం సచివాలయం కాకుండా ఇతర ప్లేసెస్ లో రీవ్యూ నిర్వహించడం ఇప్పుడు కోత్త ప్రచారాలకు తెరతీసినట్లు అయింది. దీనిపై సీఎంవో ఎలా స్పందిచి, ఏం సమాదానం చేపుతారో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి