Secunderabad: అప్పటిలోపు సికింద్రాబాద్‌ అభివృద్ధి పనులు పూర్తి: రైల్వే సహాయ మంత్రి

|

Aug 25, 2024 | 7:22 AM

దేశంలో రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ఎన్డీఏ సర్కార్ కట్టుబడి ఉందని రైల్వే శాఖ సహాయ మంత్రి రన్విత్ సింగ్ అన్నారు. రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు 27 శాతం మేర పూర్తయ్యాయని తెలిపారు. ప్రతి రోజూ 2 లక్షల మంది ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తుంటారని.. ప్రయాణికులకు ఏ మాత్రం ఇబ్బంది కలుగకుండా...

Secunderabad: అప్పటిలోపు సికింద్రాబాద్‌ అభివృద్ధి పనులు పూర్తి: రైల్వే సహాయ మంత్రి
Representative Image
Follow us on

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ కొత్త రూపు సంతరించుకుంటోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులు శరవేగంగా జరుపుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా రైల్వే శాఖ సహాయ మంత్రి రన్విత్ సింగ్‌ అభివృద్ధి పనులను పరిశీలించారు. సౌత్ సెంట్రలో జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్‌తో కలిసి ఆయన పరిశీలించారు. 2026లోపు స్టేషన్‌ను పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

దేశంలో రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ఎన్డీఏ సర్కార్ కట్టుబడి ఉందని రైల్వే శాఖ సహాయ మంత్రి రన్వీత్ సింగ్ అన్నారు. రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు 27 శాతం మేర పూర్తయ్యాయని తెలిపారు. ప్రతి రోజూ 2 లక్షల మంది ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తుంటారని.. ప్రయాణికులకు ఏ మాత్రం ఇబ్బంది కలుగకుండా అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. మొత్తం 700 కోట్లతో సికింద్రబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ది పనులు చేపట్టామన్నారు రన్విత్‌ సింగ్‌.

సికింద్రాబాద్‌ స్టేషన్‌ పరిధిలో సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటు చేస్తున్నామని.. నీటి సదుపాయం కల్పించేందుకు పెద్ద ఎత్తున ట్యాంకులను సైతం సిద్ధం చేస్తున్నామన్నారు. కొత్త ప్లాట్ ఫామ్స్, లిఫ్ట్‌లు, వైయిటింగ్ హాల్స్, పార్కింగ్ స్థలాలను సైతం అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ప్రధాని మోదీ అమృత్ భారత్ స్టేషన్‎లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న 119 రైల్వే స్టేషన్లను రూ.5వేలకోట్లతో అభివృద్ధి చేయాలని సూచించారని.

ఇందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ని సైతం అభివృద్ధి చేస్తున్నామన్నారు. మరో వైపు రైళ్లలో జనరల్‌ బోగీలను సైతం పెంచనున్నట్లు తెలిపారు. దశల వారీగా జనరల్‌ బోగీలు పెంచి.. ప్రయాణిలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 2026లోపు స్టేషన్‌ను పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నామని అన్నారు. అతి త్వరలో చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ అందుబాటులోకి రానుందని రన్విత్‌ సింగ్‌ తెలిపారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..