RTC Bus Conductor: పండగపూట దారుణం.. ఆర్టీసీ బస్సు కండక్టర్ ఆత్మహత్య..! ఏం జరిగిందో?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం బోనాల పండగ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఓ వైపు పండగ వాతావరణం నెలకొంటే.. హైదరబాద్ నగరంలో ఈ రోజు తెల్లవారు జామున ఆర్టీసీ బస్సు కండక్టర్ మృతదేహం ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించింది. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది..

RTC Bus Conductor: పండగపూట దారుణం.. ఆర్టీసీ బస్సు కండక్టర్ ఆత్మహత్య..! ఏం జరిగిందో?
ప్రస్తుతం సిటీ బస్సు మొదటి స్టేజ్‌ వరకు చార్జీ రూ. 10గా ఉంటే ఇప్పుడు దానిపై మరో రూ. 5 పెంచడంతో అది రూ. 15 చేరింది. నాలుగో స్టేజీ నుంచి అదనంగా రూ. 10 వసూలు చేయనుంది. అంటే రూ.20 నుంచి రూ.30 పెరగనుంది. మహాలక్ష్మి ఉచిత ప్రయాణం వచ్చాక రోజుకు 26 లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు అంచనా. గతంలో 11 లక్షల వరకు ప్రయాణించేవారు. ఇప్పటికే విద్యార్థుల బస్‌ పాస్‌లు, టీ-24 టికెట్‌ చార్జీలు పెంచిన ఆర్టీసీ.. ఇప్పుడు ప్రయాణికులపై భారం మోపడానికి సిద్ధమైంది.

Updated on: Jul 20, 2025 | 3:02 PM

హైదరాబాద్, జులై 20: ఆర్టీసి బస్సు కండక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడకు చెందిన జి శ్రీనివాస్ (51) 7 నెలల నుంచి ఉప్పల్ భరత్ నగనఖలో నివసిస్తున్నాడు. గత కొన్నేళ్లుగా ఉప్పల్ డిపోలో శ్రీనివాస్ కండక్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే 5 నెలల క్రితం శ్రీనివాస్‌కి పక్షవాతం రావడంతో అందుకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు.

ఏం జరిగిందో తెలియదుగానీ శనివారం (జులై 19) రాత్రి ఒంటిగంటకు బయటకు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు బయలుదేరి వెళ్లిన శ్రీనివాస్ తిరిగి ఇంటికి రాలేదు. ఉప్పల్ బీరప్ప గడ్డ ఎస్సీ కమ్యూనిటీ హాల్లో చెట్టుకు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. గమనించిన స్థానికులు ఉప్పల్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనారోగ్య కారణాల వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.