Kishan Reddy: స్మార్ట్ సిటీల నిధులపై కిషన్ రెడ్డి క్లారిటీ.. టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ మండిపాటు!

| Edited By: Ganesh Mudavath

Jul 27, 2022 | 3:49 PM

స్మార్ట్‌ సిటీలకు కేంద్రం నిధులపై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. నిధుల విడుదలపై కేసీఆర్‌ అబద్ధాలు చెబుతున్నారని..

Kishan Reddy: స్మార్ట్ సిటీల నిధులపై కిషన్ రెడ్డి క్లారిటీ.. టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ మండిపాటు!
Union Minister G Kishan Reddy(File Photo)
Follow us on

స్మార్ట్‌ సిటీలకు కేంద్రం నిధులపై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. నిధుల విడుదలపై కేసీఆర్‌ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణకు ఇప్పటికే కేంద్రం 392 కోట్ల విడుదల చేసిందని చెప్పారు. వరంగల్‌,కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ పనులకు స్టేట్‌ వాటా 50 శాతం నిధులు ఇంకా ఇవ్వలేదని అన్నారు. 2015 నుంచి ఇప్పటివరకూ కేవలం 210 కోట్లు మాత్రమే ఇచ్చారని చెప్పారు. అమృతస్కీమ్‌ కింద ఇప్పటివరకూ కేంద్రం తెలంగాణకు 2780 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిందని గుర్తు చేశారు. కేంద్రం నిధుల విడుదల పై రాష్ట్రం తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. స్మార్ట్ సిటీ మిషన్ పథకం ప్రారంభమైనప్పటి నుంచి కేంద్రం నిధులు కేటాయిస్తుంటే.. తెలంగాణ మాత్రం ఆరు సంవత్సరాలు ఆలస్యం చేసిందని చెప్పారు. చివరకు కేంద్రం ఒత్తిడి తెస్తే 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి కేటాయింపులు ప్రారంభించిందన్నారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా తెలంగాణకు రూ. 2,780 కోట్లు ఇచ్చామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

మరోవైపు తెలంగాణ పాలనపై కూడా కిషన్ రెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వంలోని ఆర్థిక, వైద్య, ఆరోగ్య, రెవెన్యూ, మునిసిపల్, మైనింగ్, పట్టణాభివృద్ధి, ఐటీ వంటి కీలక మంత్రిత్వశాఖలు ఒకే కుటుంబం వద్ద ఉన్నాయని వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీ ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు కేంద్రప్రభుత్వంపై ఏ విధమైన దుష్ప్రచారం సాగిస్తుందో అర్థమౌతోందని పేర్కొన్నారు. మూడేళ్లుగా స్మార్ట్ సిటీస్ కు కేంద్రం రూపాయి కూడా విడుదల చేయలేదనేది పచ్చి అబద్ధం అని కిషన్ రెడ్డి వివరించారు. కేంద్ర ప్రభుత్వం మీద నిందలు ఆపి, రాష్ట్ర ప్రభుత్వ పాలనపై దృష్టి సారించాలని కోరారు.

స్మార్ట్ సిటీ మిషన్ పథకం ప్రారంభమైంది. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్రం నిధులు కేటాయిస్తోంది. కానీ తెలంగాణ మాత్రం మ్యాచింగ్ గ్రాంట్ నిధులను 6 సంవత్సరాలు ఆలస్యం చేసింది. సకాలంలో నిధులు విడుదల చేసుంటే కరీంనగర్, వరంగల్ నగరాల్లో డ్రైనేజీ పనులు పూర్తయ్యేవి. కేంద్ర ప్రభుత్వంపై నిందలు ఆపండి. మీ పాలనపై దృష్టి పెట్టండి.

          – కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి