అలా చేస్తే టీఆర్‌ఎస్‌లో చేరేందుకు నేను సిద్ధం: రాజా సింగ్

| Edited By: Ravi Kiran

Apr 15, 2019 | 6:15 PM

అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం, గోవులను రక్షించేందుకు, మత మార్పిడిలకు వ్యతిరేకంగా తాము చేస్తున్న ఉద్యమంలో కేసీఆర్ కలిసివస్తే తాను టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, అఖండ హిందూ రాష్ట్ర స్థాపనకు ప్రతి హిందువు కంకణబుద్ధుడు కావాలని ఆయన పిలుపునిచ్చారు. రామ మందిరం పూర్తైన తరువాత కాశీ, మథురలోని మందిరాలను నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో శ్రీరామ శోభాయాత్ర అనంతరం జరిగిన బహిరంగ […]

అలా చేస్తే టీఆర్‌ఎస్‌లో చేరేందుకు నేను సిద్ధం: రాజా సింగ్
Follow us on

అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం, గోవులను రక్షించేందుకు, మత మార్పిడిలకు వ్యతిరేకంగా తాము చేస్తున్న ఉద్యమంలో కేసీఆర్ కలిసివస్తే తాను టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, అఖండ హిందూ రాష్ట్ర స్థాపనకు ప్రతి హిందువు కంకణబుద్ధుడు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

రామ మందిరం పూర్తైన తరువాత కాశీ, మథురలోని మందిరాలను నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో శ్రీరామ శోభాయాత్ర అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నేడు దేశంలో జై శ్రీరామ్ అనడం కూడా మతపరమైనదిగా మారిందని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారత మాతకీ జై.. వందేమాతరం అనడానికి సిగ్గుపడే వారికి దేశంలో ఉండే అర్హత లేదని అన్నారు. 10-20 నిమిషాల పాటు తమకు సమయమిస్తే దేశంలో ఉన్న దేశ ద్రోహులను తరిమికొడతామని రాజాసింగ్ పేర్కొన్నారు.