Telangana: పోలీసుల కస్టడీకి జూబ్లీహిల్స్ కేసు నిందితులు.. మైనర్లనూ మేజర్లుగా పరిగణిస్తామన్న పోలీసులు

|

Jun 09, 2022 | 6:17 PM

సంచలనం కలిగించిన జూబ్లీహిల్స్(Jubilee Hills Case) గ్యాంగ్‌రేప్‌ కేసులో మైనర్లకు నాలుగో రోజుల కస్టడీలోకి పోలీసులు తీసుకోనున్నారు. రేపటి నుంచి వారిని విచారించేందుకు జువైనల్ కోర్టు అనుమతి ఇచ్చింది. కస్టడీ ...

Telangana: పోలీసుల కస్టడీకి జూబ్లీహిల్స్ కేసు నిందితులు.. మైనర్లనూ మేజర్లుగా పరిగణిస్తామన్న పోలీసులు
Jubilee Hills
Follow us on

సంచలనం కలిగించిన జూబ్లీహిల్స్(Jubilee Hills Case) గ్యాంగ్‌రేప్‌ కేసులో మైనర్లకు నాలుగో రోజుల కస్టడీలోకి పోలీసులు తీసుకోనున్నారు. రేపటి నుంచి వారిని విచారించేందుకు జువైనల్ కోర్టు అనుమతి ఇచ్చింది. కస్టడీ అనంతరం మైనర్లను జువైనల్‌ హోం తరలించాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో నిందితుడు సాదుద్దీన్ మాలిక్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. మైనర్లతో(Hyderabad) మాలిక్‌కు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. కేసులో ఆరుగురు నిందితులు కాకుండా ఇతర వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారానికి పాల్పడిన ఐదుగురిలో ఇద్దరు మేజర్లని చెప్పిన పోలీసులు.. తర్వాత ఒకరే మేజర్ అని, నలుగురు మైనర్లని తేల్చారు. ముందుగా ప్రకటించిన మేజర్ కు 18 ఏళ్లు నిండేందుకు ఇంకా నెల రోజులు ఉండటంతో అతడిని మైనర్ గా తేల్చారు. నిందితుల్లో సాదుద్దీన్‌ మాలిక్‌ ఓ టీఆర్‌ఎస్‌ నేత కుమారుడు కాగా.. ఇద్దరు మైనర్లు కూడా టీఆర్‌ఎస్‌ నేతల కుమారులని తెలిసింది.

మరోవైపు.. రేప్ కేసు నిందితులను ట్రయల్ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డును పోలీసులు కోరారు. మైనర్ల మానసిక స్థితి, నేరం చేయడనికి వారికి ఉన్న సామర్థ్యాలను పరిగణలోకి తీసుకుని జువైనల్ జస్టిస్ నిర్ణయాన్ని వెల్లడించనుంది. కేసులో పట్టుబడ్డ నలుగురు మైనర్లే అని వీరిపై సెక్లన్లను పూర్తిగా అమలు చేసేందుకు మేజర్లుగా పరిగణించాల్సి ఉంటుందని జువైనల్ బోర్డుకు పోలీసులు వివరించారు. ఛార్జ్‌షీట్ దాఖలు సమయానికి నిందితులందరూ మేజర్లు అవుతారని తెలిపారు. పూర్తిస్థాయిలో విచారించి, శిక్షలు పడేలా చేయాలంటే నిందితులను మేజర్లుగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి