Hyderabad: హైద‌రాబాద్ పోలీసుల మరో ఘనత.. 2 గంట‌ల్లోనే రెండు కిడ్నాప్ కేసులకు చెక్..

|

Jun 04, 2023 | 9:27 PM

హైదరాబాద్‌లో వెలుగులోకొచ్చింది. పారాహుషార్ అని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. ఆటోలోంచి దిగిన మహిళ.. గుట్టు చప్పుడు కాకుండా పసిపిల్లల్ని ఎత్తుకెళ్లుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్న ఈ దృశ్యం..

Hyderabad: హైద‌రాబాద్ పోలీసుల మరో ఘనత.. 2 గంట‌ల్లోనే రెండు కిడ్నాప్ కేసులకు చెక్..
Hyderabad Kidnap
Follow us on

మహానగరంలో మాయగాళ్లు రకరకాల ముసుగులేసుకుని తెగబడుతున్నారు. అందులో లేటెస్ట్‌ ట్రెండ్ ఏంటంటే… ఫుత్‌పాత్‌పై నిద్రపోతున్న పసిపిల్లల్ని ఎత్తుకెళ్లి అమ్ముకోవడం. మంచి లాభసాటి చీకటి వ్యాపారంగా సాగుతున్న ఈ దందా ఒకటి హైదరాబాద్‌లో వెలుగులోకొచ్చింది. పారాహుషార్ అని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. ఆటోలోంచి దిగిన మహిళ.. గుట్టు చప్పుడు కాకుండా పసిపిల్లల్ని ఎత్తుకెళ్లుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్న ఈ దృశ్యం.. ప్యారడైజ్ ప్రాంతంలోని ఒక ఫుట్‌పాత్ దగ్గరది. మూడున్నరేళ్ల పసిపాప కిడ్నాపైనట్టు కంప్లయింట్ అందుకున్న పోలీసులు.. ఆగమేఘాల మీద దర్యాప్తు చేసి.. కొన్ని గంటల్లోనే ట్రేసవుట్ చేశారు. నాలుగు బృందాలుగా విడిపోయి సీసీ ఫుటేజ్ పరిశీలించి ఆటోను గుర్తించారు. కిడ్నాప్‌కు పాల్పడ్డ దంపతుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ల దగ్గర ఈ పాపతో పాటు మరో చిన్నారి కూడా ఉంది.

హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌పై నిద్రించే పసిపిల్లలే టార్గెట్‌గా ఒక పెద్ద కిడ్నాప్‌ ముఠానే తిరుగుతోందన్న విషయాన్ని బైటపెట్టారు పోలీసులు. సుల్తాన్‌బజార్‌ బొగ్గులకుంటలో కూడా ఏడునెలల పాప కిడ్నాపైనట్లు ఫిర్యాదు అందింది. అది కూడా వీళ్లపనే కావొచ్చని అనుమానిస్తున్నారు. కిడ్నాప్ చేశాక చిన్నారులను ఎవరికి విక్రయిస్తున్నారు అని లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ ముఠా ఎంతకైనా తెగించవచ్చని, ఫుట్‌పాత్‌పై నిద్రించేవాళ్లు పసిపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం