హైదరాబాద్‌లో విషాదం.. ఆక్సిజన్‌ అందక కింగ్‌ కోఠి ఆస్పత్రిలో ముగ్గురు కరోనా పేషెంట్లు మృతి.. కారణం ఏంటంటే..!

|

May 09, 2021 | 10:34 PM

Oxygen Shortage: కరోనా మహమ్మారి ప్రభావం అంతా ఇంతా కాదు. ఒక వైపు కరోనా బారిన పడి మృత్యువాత పడుతుంటే.. మరో వైపు సరైన ఆక్సిజన్‌ అందక మరి కొందరు మృతి చెందుతున్నారు.

హైదరాబాద్‌లో విషాదం.. ఆక్సిజన్‌ అందక కింగ్‌ కోఠి ఆస్పత్రిలో ముగ్గురు కరోనా పేషెంట్లు మృతి.. కారణం ఏంటంటే..!
Follow us on

Oxygen Shortage: కరోనా మహమ్మారి ప్రభావం అంతా ఇంతా కాదు. ఒక వైపు కరోనా బారిన పడి మృత్యువాత పడుతుంటే.. మరో వైపు సరైన ఆక్సిజన్‌ అందక మరి కొందరు మృతి చెందుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని కింగ్‌ కోఠి ఆస్పత్రిలో సకాలంలో ఆక్సిజన్‌ అందక ముగ్గురు కరోనా బాధితులు మృతి చెందారు. ప్రాణవాయువు లేక రెండు గంటలుగా 20 మంది రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. అధికారుల నిర్లక్ష్యం చూపారని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రికి ఆక్సిజన్‌ రవాణాలో ఆలస్యమైందని, అందుకే సమయానికి అందించలేకపోయామని అధికారులు చెబుతున్నారు.

అయితే జడ్చర్ల నుంచి కింగ్‌కోఠి ఆస్పత్రికి ఆక్సిజన్‌ ట్యాంకర్ రావాల్సి ఉంది. అయితే డ్రైవర్‌కు సరైన చిరునామా తెలియకపోవడంతో ట్యాంకర్‌ డ్రైవర్‌ ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లిపోయాడు. దీనిపై నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసుల సహకారంతో కింగ్‌ కోఠి ఆస్పత్రికి ఆక్సిజన్‌ ట్యాంకర్‌ చేరింది. ఆక్సిజన్‌ ట్యాంకర్‌ ఆస్పత్రికి ఆలస్యంగా చేరుకోవడంతో ముగ్గురు మరణించారు.

కాగా, ఇలా ఆక్సిజన్‌ కొరత వల్ల ఇప్పటికే దేశంలో చాలా మంది మృత్యువాత పడ్డారు. ఒక వైపు కరోనా వ్యాక్సినేషన్‌ జరుగుతుండగా, మరో వైపు కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. ఇక సరైన సమయంలో రోగులకు ఆక్సిజన్‌ అందక మరిన్ని మరణాలు సంభవిస్తుండటంతో భయాందోళన నెలకొంటోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా తెలంగాణాలో కరోనా పాజిటివ్‌ కేసులు తక్కువగా నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా అయితే రోజురోజుకు రికార్డు స్థాయిలో కోవిడ్‌ కేసులు, మరణాలు సంభవిస్తుండటంతో ఆందోళన నెలకొంది.

ఇవీ  కూడా చదవండి:

Telangana Covid-19: కొనసాగుతున్న కరోనా విజృంభణ.. తాజాగా ఎన్ని కేసులు, మరణాలు నమోదయ్యాయంటే?

AP Corona: ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 22 వేలకు పైగా నమోదు.. మరణాలు..?