SRH vs RR: ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్‌కు హైదరాబాద్ మెట్రో గుడ్‌న్యూస్.. ఉప్పల్ మ్యాచ్‌‌ల కోసం రైళ్ల సంఖ్య పెంపు..

భాగ్యనగరంలో ఐపీఎల్‌ సందడి జోరందుకుంది. ఐపీఎల్ 2023లో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్‌ రాయల్స్‌‌తో తలపడేందుకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీం సిద్ధమైంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30గంటలకు ప్రారంభంకానుంది. ఉప్పల్ స్టేడియంలో మొత్తం ఏడు మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

SRH vs RR: ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్‌కు హైదరాబాద్ మెట్రో గుడ్‌న్యూస్.. ఉప్పల్ మ్యాచ్‌‌ల కోసం రైళ్ల సంఖ్య పెంపు..
Hyderabad Metro

Updated on: Apr 01, 2023 | 9:40 PM

భాగ్యనగరంలో ఐపీఎల్‌ సందడి జోరందుకుంది. ఐపీఎల్ 2023లో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్‌ రాయల్స్‌‌తో తలపడేందుకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీం సిద్ధమైంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30గంటలకు ప్రారంభంకానుంది. ఉప్పల్ స్టేడియంలో మొత్తం ఏడు మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

ఈ క్రమంలో రేపు (ఆదివారం) జరిగే మ్యాచ్‌ కోసం అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. మ్యాచ్ కోసం వచ్చే అభిమానుల కోసం మెట్రో రైళ్లను పెంచుతున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది.

నాగోల్‌-అమీర్‌పేట రూట్‌లో రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఈ మేరకు రైళ్ల సంఖ్యను పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. అలాగే మెట్రో రైళ్లను మధ్యాహ్నం 12.30 గంటల నుంచి పెంచుతున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us