మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్..!

| Edited By:

Jun 01, 2020 | 7:14 PM

తెలంగాణలో మందుబాబులకు మరో గుడ్‌న్యూస్. లాక్‌డౌన్ 5 సడలింపుల్లో భాగంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రాత్రి 8 గంటల వరకు షాపులు తెరిచి ఉంచుకోవడానికి అనుమతి లభించింది. ఈ క్రమంలో మరో రెండు గంటల పాటు అన్ని షాపులు తెరుచుకోనున్నాయి. అందులో వైన్ షాపులు కూడా ఉన్నాయి. ఇది ఓ రకంగా మందుబాబులకు శుభవార్తలాంటిదే. ఇక దీనివలన ప్రభుత్వానికి కూడా ఆదాయం […]

మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్..!
Follow us on

తెలంగాణలో మందుబాబులకు మరో గుడ్‌న్యూస్. లాక్‌డౌన్ 5 సడలింపుల్లో భాగంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రాత్రి 8 గంటల వరకు షాపులు తెరిచి ఉంచుకోవడానికి అనుమతి లభించింది. ఈ క్రమంలో మరో రెండు గంటల పాటు అన్ని షాపులు తెరుచుకోనున్నాయి. అందులో వైన్ షాపులు కూడా ఉన్నాయి. ఇది ఓ రకంగా మందుబాబులకు శుభవార్తలాంటిదే. ఇక దీనివలన ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాగా జూన్ 30 వరకు లాక్‌డౌన్‌ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ 5.0 కొనసాగనుంది. ఇందులో భాగంగా మరిన్ని సడలింపులకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.

Read This Story Also: మహేష్‌ ‘సర్కారు వారి పాట’.. ‘రూపాయి’ టాటూ వెనకున్న సీక్రెట్..!