కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ విసుర్లు

| Edited By:

Mar 23, 2019 | 5:19 PM

జాతీయ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అంటూ చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ… 70 ఏళ్ల కాంగ్రెస్, బీజేపీల పాలనలో దేశం ఎంతమేరకు అభివృద్ధి చెందిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పెద్ద సైజు ప్రాంతీయ పార్టీ అయితే, తమదొక బుడ్డ పార్టీ అన్నారు. తమ పార్టీకి 16 సీట్లు ఉంటే.. ఆ పార్టీకి 40కి పైగా ఉన్నాయన్నారు. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి, అఖిలేశ్ దయతలిస్తే.. సోనియా, రాహుల్ […]

కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ విసుర్లు
Follow us on

జాతీయ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అంటూ చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ… 70 ఏళ్ల కాంగ్రెస్, బీజేపీల పాలనలో దేశం ఎంతమేరకు అభివృద్ధి చెందిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పెద్ద సైజు ప్రాంతీయ పార్టీ అయితే, తమదొక బుడ్డ పార్టీ అన్నారు. తమ పార్టీకి 16 సీట్లు ఉంటే.. ఆ పార్టీకి 40కి పైగా ఉన్నాయన్నారు. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి, అఖిలేశ్ దయతలిస్తే.. సోనియా, రాహుల్ గెలుస్తారని.. లేదంటే అవికూడా రావని విమర్శించారు. అలాంటి పార్టీ జాతీయ పార్టీయా అంటూ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టారు.