AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీనేజ్ యువతికి బ్యాక్ పెయిన్..సర్జరీ చేస్తే బుల్లెట్..ఏంటా మిస్టరీ..?

ఈ మధ్య బ్యాక్ పెయిన్ అనేది కామన్ అయిపోయింది. ఎక్కువ సేపు కాలేజీలు, ఆఫీసుల్లో కూర్చోని టైమ్ స్పెండ్ చేయడం వల్ల ఈ వెన్ను సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పుడు మేము చెప్పబోయే అమ్మాయి కూడా వెన్నునొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లింది. అందరికి వచ్చే రెగ్యులర్ పెయిన్ అని భావించిన వైద్యులు మందులు రాసి పంపించారు. కానీ మెడిసిన్ తీసుకుంటున్నా కూడా ఆ యువతికి పెయిన్ రోజురోజుకు పెరిగిపోయింది. ఈ సారి డాక్టర్లు ఎక్సరే అండ్ స్కానింగ్ తీశారు. […]

టీనేజ్ యువతికి బ్యాక్ పెయిన్..సర్జరీ చేస్తే బుల్లెట్..ఏంటా మిస్టరీ..?
Ram Naramaneni
| Edited By: |

Updated on: Dec 23, 2019 | 8:24 PM

Share

ఈ మధ్య బ్యాక్ పెయిన్ అనేది కామన్ అయిపోయింది. ఎక్కువ సేపు కాలేజీలు, ఆఫీసుల్లో కూర్చోని టైమ్ స్పెండ్ చేయడం వల్ల ఈ వెన్ను సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పుడు మేము చెప్పబోయే అమ్మాయి కూడా వెన్నునొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లింది. అందరికి వచ్చే రెగ్యులర్ పెయిన్ అని భావించిన వైద్యులు మందులు రాసి పంపించారు. కానీ మెడిసిన్ తీసుకుంటున్నా కూడా ఆ యువతికి పెయిన్ రోజురోజుకు పెరిగిపోయింది. ఈ సారి డాక్టర్లు ఎక్సరే అండ్ స్కానింగ్ తీశారు. అందులో ఏదో నల్లటి వస్తువు ఉన్నట్టు గమనించారు. వెంటనే ఆపరేషన్ చేసి ఆ వస్తువును బయటకు తీశారు. కట్ చేస్తె అది బుల్లెట్. ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు డాక్టర్లు.

పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో ఈ మిస్టరీ బుల్లెట్ ఘటన చోటు చేసుకుంది.  అస్మా బేగం అనే 18 ఏళ్ల యువతి వెన్నుపూస కండరాల్లో విరిగిపోయి ఉన్న బుల్లెట్  బయటకు తీశారు వైద్యులు. సంవత్సర కాలంగా..ఇది ఆమె బాడీలో ఉన్నట్లు భావిస్తున్నారు. అసలు ఆమె బాడీలోకి బుల్లెట్ ఎలా దిగింది..? ఇంతకుముందు ఎవరైనా కాల్పులు జరిపారా? ఈ విషయం ఆమెకు తెల్సి కూడా డాక్టర్లు ఎందుకు చెప్పలేదు..? తల్లిదండ్రులకు కూడా ఈ విషయం తెల్సా అనే విషయాలు ఇప్పుడు మిస్టరీగా మారాయి. మెడికో లీగల్ కేసు కావడంతో డాక్టర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. యువతి స్వస్థలం బహదూర్‌పురాగా తెలుసుకున్న పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు.

Follow Us