Metro Train Technical Problem: హైదరాబాద్ మెట్రో రైలు మరోసారి ఆగిపోయింది. మెట్రోలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పదిహేను నిమిషాల పాటు నిలిచిపోయింది. అమీర్పేట్ నుంచి జూబ్లీహిల్స్ బస్స్టేషన్కు మధ్యలో మెట్రో రైలు నిలిచిపోయింది. సాంకేతిక సమస్యతో 15 నిమిషాల పాటు మెట్రో సేవలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో స్పందించిన మెట్రో అధికారులు స్టేషన్లో ప్రయాణికులను దింపేసి ఖాళీ ట్రైన్ను పంపించారు. కాగా, ఇటీవల కాలంలో మెట్రో రైలులో ఇలాంటి సమస్యలు చాలానే తలెత్తాయి. సాంకేతిక సమస్యల కారణంగా అప్పుడప్పుడు మెట్రో నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడిన సందర్భాలున్నాయి.
Also Read: తెలంగాణ ఎక్సైజ్ అధికారులకు శుభవార్త.. ఎట్టకేలకు ప్రమోషన్లు కల్పిస్తూ సీఎస్ కీలక ఉత్తర్వులు జారీ..!