Hyderabad: క్యూలైన్‎లో నిల్చొని ఓటు వేసిన అల్లు అర్జున్, సతీమణితో కలిసి ఓటేసిన జూనియర్ ఎన్టీఆర్..

|

May 13, 2024 | 8:26 AM

తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకున్నారు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు. తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకే ప్రారంభమైన నేపథ్యంలో జూబ్లీహిల్స్‎లో తన సతీమణితో పాటు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా తన భార్య ప్రణితతో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌లోని పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. పాన్ ఇండియా స్టార్ హీరో అల్లూ అర్జున్ కూడా తనకు కేటాయించిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.

Hyderabad: క్యూలైన్‎లో నిల్చొని ఓటు వేసిన అల్లు అర్జున్, సతీమణితో కలిసి ఓటేసిన జూనియర్ ఎన్టీఆర్..
Jr. Ntr, Allu Arjun
Follow us on

తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకున్నారు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు. తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకే ప్రారంభమైన నేపథ్యంలో జూబ్లీహిల్స్‎లో పాన్ ఇండియా స్టార్ హీరో అల్లూ అర్జున్ కూడా తనకు కేటాయించిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఈ సందర్భంగా నంద్యాల టూర్‌పై క్లారిటీ ఇచ్చారు హీరో అల్లు అర్జున్‌. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి పిలుపునిచ్చారు అల్లుఅర్జున్. అలాగే తన సతీమణితో పాటు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా తన భార్య ప్రణితతో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌లోని పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు.

 

ఇక సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగి మాజీ మంత్రి కిషన్ రెడ్డి తన భార్యతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్ సభ స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. వేసవి తాపం ఎక్కువగా ఉండటంతో ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…