హైదరాబాద్లో ప్రముఖ స్టాండప్ కమెడియన్ డేనియల్ ఫెర్నాండెజ్ కామెడీ షో క్యాన్సిల్ అయింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరికల నేపథ్యంలో ఈ షో రద్దుచేసుకున్నారు. హైదరాబాద్ లో డేనియల్ ఫెర్నాండెజ్ షో నిర్వహించాలని భావించారు. అంతేకాదు టికెట్లు సైతం విక్రయించారు. అయితే ఇటీవల జైనులను ఉద్దేశించి డేనియల్ ఫెర్నాండెజ్ చేసిన కామెడీ వీడియో వివాదాస్పదంగా మారింది. బక్రీద్ రోజు జైనులు మేకలను కొనుగోలు చేశారని తన షోలో చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ షో కోసం డేనియల్ హైదరాబాద్కు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో మునావర్ ఫరూఖీ విషయంలో ఏం జరిగిందో గుర్తుంచుకోవాలని హిందువులు, జైనుల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణకు రావాలంటే 50 సార్లు ఆలోచించాలంటూ ఓ వీడియోను రాజాసింగ్ రిలీజ్ చేశారు. ఈ వివాదం నేపథ్యంలో డేనియల్ ఫెర్నాండెజ్ తన షో క్యాన్సిల్ చేసుకున్నారు.
కమెడియన్లను రాజాసింగ్ బెదిరించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కామిక్ మునావర్ ఫారూఖీ ప్రదర్శనను హైదరాబాద్లో రద్దు చేయాలని రాజాసింగ్ హెచ్చరించారు. అయితే గట్టి భద్రతో అప్పటి ప్రభుత్వం మునావర్ షోను నిర్వహించింది. ఈ క్రమంలో మహమ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ పాసింగ్ చేస్తూ వీడియో రిలీజ్ చేయడం అల్లర్లకు దారి తీసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..