
హైదరాబాద్ని నానక్రామ్గూడలో సొనాటా సాఫ్ట్వేర్ సంస్థ కొత్త ఫెసిలిటీ సెంటర్ను ఏర్పాటు చేసింది. ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్ రెడ్డి దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, యాజమాన్యానికి ఆయన శుభాభినందనలు తెలిపారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్ జీసీసీ (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్)కు హబ్గా మారిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వీటితో పాటు AI-రెడీ డేటా సెంటర్లు, తయారీ రంగాలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందన్నారు. సొనాటా సాఫ్ట్వేర్ అత్యాధునిక AIని ఉపయోగించి పర్యావరణ వ్యవస్థలను రూపొందించడం గర్వకారణం అన్నారు.
మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, HCL టెక్, ఇన్ఫోసిస్, విప్రో వంటి IT దిగ్గజాలు హైదరాబాద్లోని తమ క్యాంపస్లను విస్తరిస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం పనిచేస్తూనే…. పరిశ్రమలకు మద్దతు ఇస్తూ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి కొత్తగా రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షకు పైగా ఉద్యోగాలు సృష్టించిందన్నారు.
2025లో దావోస్ పర్యటనలో రూ. 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టి తెలంగాణ నంబర్ 1 రాష్ట్రంగా నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశీయంగా, అంతర్జాతీయంగా పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. పోలీసింగ్, శాంతిభద్రతలు, ద్రవ్యోల్బణ నిర్వహణ, ఉద్యోగ సృష్టి, పన్ను వసూళ్లలోనూ తెలంగాణ నంబర్ వన్ గా ఉందని సీఎం రేవంత్ తెలిపారు.
హైదరాబాద్ ట్రాఫిక్ ఫోర్స్లో ట్రాన్స్జెండర్ స్వచ్ఛంద సేవకులను నియమించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని సీఎం రేవంత్ అన్నారు. 66 లక్షల మహిళలకు స్వయం సహాయక బృందాల ద్వారా సాధికారత, రాజీవ్ యువ వికాసం ద్వారా యువత వ్యాపారాలు, స్వయం ఉపాధికి అవసరమైన నిధులు ప్రభుత్వం అందిస్తోందన్నారు. డ్రై పోర్టు నిర్మాణం, ఆంధ్రప్రదేశ్ సముద్ర ఓడరేవుతో అనుసంధానం, ఫ్యూచర్ సిటీలో AI నగరం, యంగ్ ఇండియా స్కిల్స్, స్పోర్ట్స్ యూనివర్సిటీలు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం జరుగుతోందన్నారు.
ప్రపంచంలోనే గొప్ప ఈవెంట్లలో ఒకటైన మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇలాంటి మరిన్ని ప్రపంచ ఈవెంట్ల రాష్ట్రంలో నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని చెప్పారు. తెలంగాణ రైజింగ్ కార్యాచరణ ద్వారా ఆర్థికాభివృద్ధి,పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు, సంక్షేమం సమతుల్యంగా సాగుతోందన్నారు. రాష్ట్రం వన్ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో, హైదరాబాద్ను అత్యద్భుత నగరంగా మార్చడంలో అందరి సహకారం కావాలని కోరుతున్నట్లు తెలిపారు. యువత హైదరాబాద్కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారి..మన విజయాలను ప్రపంచానికి చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..