AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఓర్నాయనో.. చిట్టీలు కడుతున్నారా..? ఈ విషయం తెలిస్తే గుండె గుభేల్..

చిట్టీల పేరుతో రూ.15 కోట్లు వసూలు చేసి దంపతులు పరారైన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. చిట్టీల కాలం అయిపోయినా డబ్బులు ఇవ్వకపోవడంతో నిజాంపేట్‌లోని బండారి లేఔట్‌లో ఉన్న రేష్మ క్లినిక్ దగ్గరికి వెళ్లిన బాధితులు.. రేష్మ, అలీ దంపతులు పరారైనట్లు గుర్తించారు. 42 మంది బాధితులు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Hyderabad: ఓర్నాయనో.. చిట్టీలు కడుతున్నారా..? ఈ విషయం తెలిస్తే గుండె గుభేల్..
Chit Fund Scam
Shaik Madar Saheb
|

Updated on: Oct 18, 2025 | 10:12 AM

Share

వైద్య వృత్తిలో కొనసాగుతున్నారుగా.. అని ఎవ్వరికి అనుమానం రాలేదు.. వాళ్ల దగ్గరకు వచ్చే పేషెంట్స్, చుట్టుపక్కల వారికి చిట్టీలు వేస్తున్నామని పరిచయమయ్యారు.. అధిక వడ్డీ వస్తుందని, ఒకేసారి చిట్టిల డబ్బులు తీసుకోవచ్చంటూ అందరినీ.. నమ్మించారు.. ఇలా లక్షలు వసూలు చేసి.. కొట్లు పోగేశారు. ఆ తర్వాత కిలాడీ లేడి జంట ఒక్కసారిగా అక్కడి నుంచి జంప్ అయ్యారు. ఈ విషయం తెలుసుకుని బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. వైద్య వృత్తిలో కొనసాగుతున్న ఓ జంట చిట్టీల పేరుతో భారీ మోసానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ నగరంలోని నిజాంపేట్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. రేష్మ, అలీ అనే దంపతులు.. నిజాంపేట బండారీ లేఅవుట్‌లో ‘రేష్మ క్లినిక్’’ పేరుతో వైద్యులుగా చలామణి అవుతున్నారు.. అయితే.. చిట్టీల పేరుతో 100 మందికి పైగా వ్యక్తుల నుంచి దాదాపుగా రూ.15 కోట్ల మేర వసూలు చేశారు.. ఒక్కొక్కరి నుంచి 50, 10 లక్షలు వసూలు చేశారు. అయితే.. ఇటీవల చిట్టీల కాలం పూర్తయినప్పటికీ, డబ్బులు ఇవ్వడం లేదు.. దీంతో బాధితులు రోజూ వారి దగ్గరకు వెళ్లి ప్రశ్నిస్తున్నారు..

ఈ క్రమంలోనే.. అనుమానంతో బాధితులు క్లినిక్ వెళ్లి చూడగా.. దంపతులు అప్పటికే అదృశ్యమయ్యారు. దీంతో మోసపోయామని గ్రహించిన 42 మంది బాధితులు బాచుపల్లి పోలీసులను ఆశ్రయించారు. రేష్మ, అలీ దాదాపుగా.. బాధితుల నుంచి సుమారుగా రూ.15 కోట్లు వసూలు చేసినట్లు విచారణలో తేలిందని.. అధిక లాభాల పేరుతో ప్రజలను మోసం చేశారని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. పోలీసులు రేష్మ-అలీ దంపతుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. కాగా.. పెద్దమొత్తంలో ఆర్ధిక లావాదేవీలు జరగడంతో ఈ కేసును EOWకు బదిలీ చేయనున్న బాచుపల్లి పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మీ ఎలక్ట్రిక్ స్కూటర్‌, కారుకు నిప్పంటుకుంటే బీమా సౌకర్యం ఉంటుందా
మీ ఎలక్ట్రిక్ స్కూటర్‌, కారుకు నిప్పంటుకుంటే బీమా సౌకర్యం ఉంటుందా
పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
కన్నీళ్లు తెప్పిస్తున్న మూగజీవి విశ్వాసం..!
కన్నీళ్లు తెప్పిస్తున్న మూగజీవి విశ్వాసం..!
జగన్నాథ రథయాత్రలో ముస్లిం భక్తుడి సమాధి ముందు రథం ఎందుకు ఆగుతుంది
జగన్నాథ రథయాత్రలో ముస్లిం భక్తుడి సమాధి ముందు రథం ఎందుకు ఆగుతుంది
మీ బాత్రూమ్‌లోని బ్లాక్ మోల్డ్‌ను వదిలించుకునే ఈజీ హోమ్ రెమెడీస్
మీ బాత్రూమ్‌లోని బ్లాక్ మోల్డ్‌ను వదిలించుకునే ఈజీ హోమ్ రెమెడీస్
భార్య..భర్త.. మధ్యలో ప్రియురాలు.. ఇది మామూలు కథ కాదు..
భార్య..భర్త.. మధ్యలో ప్రియురాలు.. ఇది మామూలు కథ కాదు..
క్రికెట్‎కు గుడ్ బై చెప్పేసిన లెజెండ్
క్రికెట్‎కు గుడ్ బై చెప్పేసిన లెజెండ్
బంపర్ ఆఫర్, కొండచిలువను తీసుకురండి..ఫ్రీగా వేడివేడి పిజ్జా తినండి
బంపర్ ఆఫర్, కొండచిలువను తీసుకురండి..ఫ్రీగా వేడివేడి పిజ్జా తినండి
వారంలో ఏ రోజు డీమార్ట్‌కు వెళ్తే.. ఫ్రెష్ స్టాక్ దొరుకుతుంది?
వారంలో ఏ రోజు డీమార్ట్‌కు వెళ్తే.. ఫ్రెష్ స్టాక్ దొరుకుతుంది?
మిగిలిపోయిన టీ పొడితో చేతి నిండా డబ్బు ఆదా చేసే సూపర్ టిప్స్!
మిగిలిపోయిన టీ పొడితో చేతి నిండా డబ్బు ఆదా చేసే సూపర్ టిప్స్!