వాహనదారులకు బిగ్ అలర్ట్..! ట్రాఫిక్ చలాన్ల వసూలుకు పోలీసుల సంచలన ప్లాన్..!
హైదరాబాద్లో వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కొత్త షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే విధించే ఈ-చలాన్ల మొత్తాన్ని ఇకపై నేరుగా వాహనదారుల ఫాస్టాగ్ ఖాతా నుంచే ఆటోమేటిక్గా కట్ చేసే విధానాన్ని తీసుకురావాలని పోలీసులు ప్రతిపాదిస్తున్నారు. సాంకేతికతను ఉపయోగించి చలాన్ల వసూళ్లను మరింత వేగవంతం చేయడంతో పాటు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను తగ్గించడమే ఈ ప్రతిపాదన లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు.

హైదరాబాద్లో వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కొత్త షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే విధించే ఈ-చలాన్ల మొత్తాన్ని ఇకపై నేరుగా వాహనదారుల ఫాస్టాగ్ ఖాతా నుంచే ఆటోమేటిక్గా కట్ చేసే విధానాన్ని తీసుకురావాలని పోలీసులు ప్రతిపాదిస్తున్నారు. సాంకేతికతను ఉపయోగించి చలాన్ల వసూళ్లను మరింత వేగవంతం చేయడంతో పాటు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను తగ్గించడమే ఈ ప్రతిపాదన లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు.
సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వార్షికోత్సవ కార్యక్రమంలో ఈ ప్రతిపాదనకు సంబంధించిన వివరాలను జాయింట్ సీపీ సున్ప్రీత్ సింగ్ వెల్లడించారు. ఈ విధానం అమలుపై హెచ్ఎండీఏ అధికారులతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. సంబంధిత అనుమతులు, సాంకేతిక అంశాలు పూర్తయిన తర్వాత ఈ వ్యవస్థను అమల్లోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుతం నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలను కెమెరాలు, ఇతర సాంకేతిక వ్యవస్థల ద్వారా గుర్తించి ఈ-చలాన్లు జారీ చేస్తున్నారు. అయితే చాలామంది వాహనదారులు జరిమానాలను వెంటనే చెల్లించకుండా పెండింగ్లో ఉంచుతున్నారని పోలీసులు చెబుతున్నారు. దీంతో బకాయి చలాన్ల వసూళ్లకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఫాస్టాగ్తో అనుసంధానం చేస్తే జరిమానా విధించిన వెంటనే నిర్దేశిత మొత్తాన్ని వసూలు చేసే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
అయితే ఈ ప్రతిపాదన కేవలం చలాన్ల వసూళ్లకే పరిమితం కాకుండా నగర ట్రాఫిక్ నిర్వహణలో సాంకేతికత వినియోగాన్ని మరింత పెంచే దిశగా అడుగుగా అధికారులు భావిస్తున్నారు. పెరుగుతున్న వాహనాల సంఖ్య, రద్దీ, పార్కింగ్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు సమగ్ర ప్రణాళిక అవసరమని చెబుతున్నారు.
ప్రజా రవాణాను బలోపేతం చేయడం, లాస్ట్మైల్ కనెక్టివిటీని మెరుగుపరచడం, ప్రధాన ప్రాంతాల్లో మల్టీ లెవల్ పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయడం వంటి చర్యలు కూడా అవసరమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. రోడ్లపై అక్రమ పార్కింగ్ను నియంత్రించడంతో పాటు సొంత వాహనాల వినియోగాన్ని తగ్గించేలా ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఫాస్టాగ్ నుంచి చలాన్ల ఆటోమేటిక్ వసూలు విధానం అమల్లోకి వస్తే.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై ఆర్థికంగా తక్షణ ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఈ విధానం ఎప్పుడు అమల్లోకి వస్తుంది? ఏ నిబంధనల ప్రకారం చలాన్లు కట్ చేస్తారు? వాహనదారులకు ముందస్తు సమాచారం ఎలా ఇస్తారు? వంటి అంశాలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
