Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు షాక్‌.. రాయితీల్లో కోత.. పెరగనున్న స్మార్ట్ కార్డ్స్ ధరలు..

|

Apr 01, 2023 | 6:21 AM

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు షాక్‌ ఇచ్చింది. ఛార్జీలు పెంచకుండానే ప్రయాణికులపై కొంత భారం వేసింది. ఏప్రిల్ 1 అంటే ఈరోజు నుంచి మెట్రో రాయితీలలో కోత విధించనున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. రద్దీ వేళల్లో డిస్కౌంట్ ఎత్తివేయనున్నట్లు తెలిపారు. మెట్రో కార్డు, క్యూఆర్ కోడ్‌పై ఇప్పటి వరకు ప్రయాణ ఛార్జీల్లో 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు.

Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు షాక్‌.. రాయితీల్లో కోత.. పెరగనున్న స్మార్ట్ కార్డ్స్ ధరలు..
Hyderabad Metro
Follow us on

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు షాక్‌ ఇచ్చింది. ఛార్జీలు పెంచకుండానే ప్రయాణికులపై కొంత భారం వేసింది. ఏప్రిల్ 1 అంటే ఈరోజు నుంచి మెట్రో రాయితీలలో కోత విధించనున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. రద్దీ వేళల్లో డిస్కౌంట్ ఎత్తివేయనున్నట్లు తెలిపారు. మెట్రో కార్డు, క్యూఆర్ కోడ్‌పై ఇప్పటి వరకు ప్రయాణ ఛార్జీల్లో 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈరోజు నుంచి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కార్డులపై డిస్కౌంట్ ఉండదు. రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే ఈ రాయితీ అమలులో ఉండనుంది. ఇక సెలవు రోజుల్లో ప్రయాణించేందుకు ఇస్తున్న హాలీడే కార్డు ధర 59 రూపాయల నుంచి 99కి పెంచనున్నారు. స్మార్ట్ కార్డ్స్ ధర కూడా పెంచబోతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..