
భూమి గుండ్రంగా ఉండును, తన చుట్టూ తానే తిరుగును.. అన్నట్టుంది తెలంగాణలో పరిస్థితి. పన్నెండేళ్లుగా రైతు భూమి చుట్టూనే చక్కర్లు కొడుతోంది రాజకీయం. ఆరేళ్ల కిందట కేసీఆర్ జమానాలో అక్టోబర్లో అఫీషియల్గా జనంలోకి వచ్చిన ధరణి పోర్టల్.. తర్వాత ప్రభుత్వం మారి, వాళ్లన్నట్టే బంగాళాఖాతంలో కలిసిపోయింది. దాని స్థానంలో భూభారతి పేరుతో కొత్త చట్టమొచ్చి చేరింది. స్పాన్సర్డ్ బై రేవంత్ సర్కార్. కానీ, ఏడాది కిందట భూస్థాపితమైన ధరణి చట్టాన్ని మళ్లీ తవ్వితీసి అక్రమాల నిగ్గు తేల్చాలని డిసైడైంది రేవంత్ సర్కార్. తెలంగాణలో తాజా భూకంపం పర్యవసానాలేంటి? ఎన్ని లక్షల ఎకరాలకు ఓనర్షిప్పును తేలుస్తుంది? ఎవరెవరి కిందకు నీళ్లొస్తాయి..? అపోజిషన్ పార్టీకయ్యే డ్యామేజ్ ఎంత? పరిశీలిద్దాం.. మాజీ సీఎం కేసీఆర్ మానసపుత్రిక ధరణికి కొత్తగా క్లయిమాక్స్ రాసుకున్నట్టుంది రేవంత్ సర్కార్. ధరణి చట్టంపై స్పెషల్ ఎంక్వైరీ టీమ్ ఏర్పాటు చేసి, అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని చేతికి బెత్తం అందుకుంది రేవంత్ సర్కార్. భూ రికార్డులను తారుమారు చేసినవాళ్లను, అక్రమ మ్యూటేషన్లకు పాల్పడినవాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, అవసరమైతే మాజీ ఉన్నతాధికారులకు నోటీసులు ఇస్తామని హెచ్చరిస్తోంది. ధరణి అమలు టైమ్లో జరిగిన లావాదేవీలన్నీ రేవంత్ టేబుల్ మీదికి రాబోతున్నాయి. ధరణి పోర్టల్కు సంబంధించి టెండర్ ప్రక్రియ నుంచి,...