Bhadrachalam: మత్తుమందు ఇచ్చి గర్భిణిపై ఎంఎన్‌వో అత్యాచారయత్నం.. భద్రాచలంలో అమానుష ఘటన

|

Apr 29, 2022 | 12:48 PM

Bhadrachalam: దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొందరు ప్రబుద్దులు దారుణానికి ఒడిగడుతున్నారు. వారు చేసిన పనులు చేస్తుంటే సమాజమే తలదించుకునేలా ఉంటున్నాయి..

Bhadrachalam: మత్తుమందు ఇచ్చి గర్భిణిపై ఎంఎన్‌వో అత్యాచారయత్నం.. భద్రాచలంలో అమానుష ఘటన
Follow us on

Bhadrachalam: దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొందరు ప్రబుద్దులు దారుణానికి ఒడిగడుతున్నారు. వారు చేసిన పనులు చేస్తుంటే సమాజమే తలదించుకునేలా ఉంటున్నాయి. తాజాగా తెలంగాణ (Telangana)లోని భద్రాచలంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ప్రసవరం కోసం వచ్చిన ఓ మహిళపై ఆపరేషన్‌ థియేటర్‌లో అత్యాచారయత్నం జరిగింది. మత్తుమందు ఇచ్చి గర్భిణిపై ఎంఎన్‌వో (MNO) లాల్‌ఖాన్‌ ఈ దారుణానికి ఒడిగట్టాడు. అయితే గర్భిణిపై అత్యాచారానికి ప్రయత్నిస్తుండగా చూసిన మరో ఉద్యోగి అతన్ని అడ్డుకుని లాల్‌ఖాన్‌పై సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఎంఎన్‌వో లాల్‌ఖాన్‌కు మెమో జారీ చేశారు.

దేశంలో ఇలాంటి నీచులు ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారు. ఎన్నో కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి వారికి ఏ మాత్రం క్షమించకుండా కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరుగగానే కేసులు నమోదు చేసి జైలుకు పంపించి తర్వాత యధావిధిగా బయటకు వచ్చేస్తున్నారని, అలా కాకుండా యవజ్జీవ కారాగార శిక్షలు, ఉరి శిక్షలు లాంటివి వస్తే అప్పుడు వారిలో భయం పుట్టుకొస్తుందని అంటున్నారు. దేశంలో ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Ramya Murder Case: బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో విచారణ పూర్తి.. ఇవాళ కోర్టు తీర్పు

Bengaluru: కఠిన చట్టాలు వచ్చినా.. ఇంకా ఆగని ఉన్మాదం.. యువతిపై యాసిడ్ దాడి