
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల ఆరోపణలతో కేసు నమోదైంది. పెళ్లి పేరుతో తనను మోసం చేసి వేధించారని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఫిర్యాదు వివరాల ప్రకారం.. ఇంటర్వ్యూ పేరుతో తనను ఫ్లాట్కు పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. అనంతరం పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో సన్నిహిత సంబంధం కొనసాగించారని, ఆ తర్వాత మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. తనకు తెలియకుండా ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించారని, వాటిని ఉపయోగించి ఇబ్బందులకు గురిచేశారని బాధితురాలు ఆరోపించింది. అలాగే రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో తన నుంచి భారీగా డబ్బులు తీసుకున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొంది.
అంతేకాకుండా తన మొబైల్ ఫోన్కు యాక్సెస్ పొంది, తన స్నేహితురాలితో కూడా ఇదే విధంగా పరిచయం పెంచుకునేందుకు ప్రయత్నించారని బాధితురాలు ఆరోపించింది. ఈ ఫిర్యాదుపై జూలై 26వ తేదీన పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ఆరోపణలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆధారాల సేకరణ, బాధితురాలి వాంగ్మూలం, ఇతర సంబంధిత వివరాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆరోపణలపై రేగా కాంతారావు స్పందన తెలియాల్సి ఉంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..